హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాస్వామిక ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలే పునాదులని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. భావి భారత నిర్మాతలుగా రేపటి యువతను తయారుచేసే దిశగా, దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత సమర్థ నాయకత్వాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరమున్నదని చెప్పారు. ఇందుకు రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, సైద్ధాంతిక రంగాల్లో బోధన, శిక్షణ అవసరమున్నదని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా చేపట్టిన చర్యల్లో భాగంగా సోమవారం హైదరాబాద్ కోకాపేటలో ‘భారత్ భవన్’ (సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్)కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘దేశ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుంటూ పనిచేసే సమర్థ నాయకత్వం వర్తమాన భారతానికి అవసరమున్నది. సమాజాభివృద్ధికి దోహదం చేసే దిశగా నాయకత్వాన్ని తీర్చిదిద్దుకోవాల్సి న బాధ్యత మనమీద ఉన్నది. ఇందుకోసం ఆయా రంగాల్లో అనుభవజ్ఞులైన గొప్ప మేధావులను, నోబెల్ బహుమతి గ్రహీతలను పిలి చి నాయకత్వ శిక్షణను ఇప్పిస్తాం. ప్రజల కు సుపరిపాలనను అందించే నాయకత్వా న్ని తీర్చిదిద్దుతాం. తద్వారా భారత ప్రజాస్వామిక సౌధాన్ని పటిష్టం చేసేందుకు కృషి చే స్తాం. అందులో భాగంగానే పొలిటికల్ ఎక్సలెన్స్ అండ్ హెచ్ఆర్డీ కేంద్రాన్ని తీర్చిదిద్దాలనే నిర్ణయం తీసుకున్నాం’ అని తెలిపారు.
రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో శిక్షణనిచ్చేందుకు దేశ నలుమూలలనుంచి అనుభవజ్ఞులైన రాజనీతి శాస్త్రజ్ఞులు, ఆర్థిక, సామాజికవేత్తలు రచయితలు, ప్రొఫెసర్లు, విశ్రాంత అధికారులు తదితరులను ఆహ్వానించనున్నట్టు సీఎం తెలిపారు. భారత్భవన్లో సమగ్రమైన సమస్త సమాచారం లభ్యం అవుతుందని చెప్పారు. శిక్షణకు అనుగుణంగా తరగతిగదులు, ప్రొజెక్టర్లతో కూడిన మినీహాల్స్, విశాల సమావేశ మందిరాలు, అత్యాధునిక సాంకేతికత కలిగిన డిజిటల్ లైబ్రరీలు, వసతికోసం లగ్జరీ గదులు నిర్మితమవుతాయని వివరించారు. ప్రపంచ రాజకీయ, సామాజిక, తాత్విక రంగాలకు చెందిన మేధావుల రచన లు, గ్రంథాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. స్థానిక, దేశీయ, అంతర్జాతీయ మీడియా చానళ్ల సమాచార కేంద్రాలుండేలా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. వార్తలు, కథనాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ విశ్లేషించి, క్రోడీకరించే వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు.
ప్రజలను ప్రభావితం చేస్తున్న సామాజిక మాధ్యమాలపై అవగాహన కోసం ప్రత్యేక శిక్షణాతరగతులు ఉంటాయని సీఎం కేసీఆర్ అన్నారు. మీడియారంగంలో రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే దిశగా సీనియర్ టెక్నికల్ బృందా లు కూడా పనిచేస్తాయని తెలిపారు. సంక్షే మం, అభివృద్ధి రంగాల అధ్యయనం దిశగా, శిక్షణ సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. భారత్ భవన్కు కేటాయించిన స్థలంలోని కొంతమేరకే భవన నిర్మాణం చేపడుతామని, మిగిలిన స్థలమంతా పచ్చదనంతో నింపుతామన్నారు. విశాల ప్రాంతం లో ఆహ్లాదకర వాతావరణంలో శిక్షణ, బోధ న అందుతుందని తెలిపారు. భవన నిర్మాణ సమయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ కు సీఎం పలు సూచనలు చేశారు.
భారత్ భవన్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రోచ్ఛారణల నడుమ వేదపండితులు నిర్వహించిన భూ వరాహ హోమంలోనూ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం నిర్దేశిత ముహూర్తానికి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ వెంట మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు, ఎంపీలు సంతోష్కుమార్, దీవకొండ దామోదర్రావు, కేఆర్ సురేశ్రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్యయాదవ్, బీబీ పాటిల్, రంజిత్రెడ్డి, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, మధుసూదనాచారి, కల్వకుంట్ల కవిత, శేరి సుభాష్రెడ్డి, నవీన్కుమార్, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, శంభీపూర్ రాజు, బస్వరాజు సారయ్య, వెంకట్రామిరెడ్డి, మహేందర్రెడ్డి, గోరటి వెంకన్న, యెగ్గె మల్లేశం, ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్, దానం నాగేందర్, కాలె యాదయ్య, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.