హైదరాబాద్/సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ): నిమ్స్ కొత్త భవన నిర్మాణ పనులకు 14న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఆదివారం రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్పతో కలిసి నిర్మాణ స్థలంలో కలియతిరిగారు. ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించి, పలు సూచనలు చేశారు. ఆర్అండ్బీ తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. మంత్రి వెంట ఆర్అండ్బీ అధికారులు గణపతిరెడ్డి, హఫీజ్, శశిధర్, డీఈ మోహన్, మాధవి, నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్, మీడియా కో-ఆర్డినేటర్ సత్యాగౌడ్తో పాటు నిర్మాణ సంస్థ ప్రతినిధులు తదితరులు ఉన్నారు.
తుది దశకు స్మారక స్థూపం పనులు
హుస్సేన్సాగర్ తీరాన నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం పనులు తుది దశకు చేరుకున్నాయి. పనులను ఆదివారం హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్తోపాటు పలువురు అధికారులతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పరిశీలించారు. అమరవీరుల స్థూపం వెలుపల రోడ్లు, ఫుట్పాత్తోపాటు పలు సుందరీకరణ పనులపై పలు సూచనలు చేశారు.