CM KCR | బీసీ బిడ్డలకు అవకాశం రావడం లేదని.. అవకాశం వచ్చినకాడ చైతన్యం ఏమైందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. మంథని ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. మంథని ఎమ్మెల్యేగా బీసీ బిడ్డ పుట్ట మధును గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బీసీ బిడ్డలకు అవకాశం రావడం లేదు. మంథనిలో ఉన్న ప్రతి ఒక్క బీసీతో మాట్లాడుతన్న. రానికాడ టికెట్ రాకపాయే.. వచ్చిన కాడ చైతన్యం ఏమైతున్నట్టు.. ? నేను మంథనిలో బీసీ బిడ్డలతో పంచాయితే పెట్టుకుంట నేను చెబుతున్నారు. ఇవాళ నేను వెళ్లి తర్వాత ప్రతి బీసీ ఇంట్లో, ప్రతి బలహీన వర్గాల ఇంట్లో చర్చ జరగాలి’ అని పిలుపునిచ్చారు.
‘బీసీ నాయకుడు.. బలంగా ఎదిగి వచ్చి పని చేస్తుంటే.. ఎందుకు అతన్ని ఇబ్బంది పెట్టాలి ? అవకాశాలు వచ్చేదే తక్కువ మందికి. అవకాశం వచ్చినప్పుడు మన బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ఐక్యత ఎందుకు లోపిస్తున్నది ? నేను మీ అందరికీ అప్పీల్ చేస్తున్నా. ఎవరైతే బీసీ ఉద్యోగస్తులున్నరో.. బీసీ విద్యార్థులున్నరో.. బీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నరో దయచేసి మీ చైతన్యాన్ని ఈ ఎన్నికల్లో చూపించాలి. పుట్ట మధు గత ఎన్నికల్లో ఓటమిపాలైనా.. వెంటనే వచ్చిన అవకాశంతో జడ్పీ చైర్మన్ను చేసుకున్నాం. నేను మీకు ఒకటే మనవి చేస్తున్నా. ఇది వెనుకబడిన ప్రాంతం. ఎలక్షన్లు కాంగనే అవతలపడేటోళ్లు కాదు. పుట్ట మధులాగా ప్రజల మధ్యనే ఉండెటోళ్లు కావాలే మనకు. మంటిపనైనా ఇంటోడు కావాల్రా అన్నారు’ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
‘హైదరాబాద్లో కుసున్నోళ్లకు ఓటు వేస్తే ఏమైతది ? ఫలితం ఏం వస్తుంది ? పోయి కలుసుడే. భ్రమలోపడి, వెర్రిలోపడి అలాంటివారికి ఓటువేస్తే రాదు.. ఇక్కడే ప్రజల్లో ఉండి ముండికి మన్నంటంగ తిరిగినోడే సిపాయి. వాళ్లు గెలిస్తేనే మనం బాగుపడుతాం తప్ప.. స్టయిల్గా వచ్చి చేతులు ఊపి మాట్లాడేవారితో కాదు. అందువల్ల నేను మీ అందరికీ కోరుతున్నా. బీసీ బిడ్డకు అవకాశం వచ్చినప్పుడు చైతన్యం చూపించి చూపించాలి. పుట్ట మధును తప్పకుండా ఈ సారి గెలిపించాలి. మంథనిలో ఒకరోజంతా మీతోనే ఉంటా’నన్నారు.
‘మంథని టౌన్లో ఈ నియోజకవర్గ అవసరాల మీద సమీక్ష పెట్టి అవసరమైతే ప్రత్యేకంగా రూ.1000కోట్లు మంజూరు చేసి మంథని తీర్చిదిద్దే బాధ్యత నాది. మీ దరిద్రం పోగెట్టే బాధ్యత నాది అని మనవి చేస్తున్నా. మీకు ఏం అవసరాలున్నాయో మధుకు తెలుసు. ఆ రోజు నేనుకూడా ఉంటా. అన్ని మండలాల నాయకులను పిలుచుకొని.. ఆఫీసర్లను కూర్చుండబెట్టుకుందాం. మీకు ఏం ఏం చావాలో చేసి పెట్టే బాధ్యత నాది. నా మాటగా ప్రజలకు గ్రామగ్రామాల్లో అని బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలను కోరుతున్నా. ప్రత్యేకమైన నిధిని వెనుకబడ్డ మంథని నియోజవర్గానికి ఇస్తాం. తప్పకుండా పూర్తిస్థాయిలో అభివృద్ధికి సహకరిస్తా. మధు ఆధ్వర్యంలో ఆ పనులన్నీ చేసుకోవాలని సూచిస్తున్నా’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.