హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రంలో కులవృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు విశేష కృషి చేస్తున్న సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీకే తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు రజక సంఘాల సమితి రాష్ట్ర ముఖ్య సలహాదారు, ఎంబీసీ రాష్ట్ర కోకన్వీనర్ కొండూరు సత్యనారాయణ ప్రకటించారు.
ఆదివారం మునుగోడు నియోజకవర్గ రజక ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రజకులకు, నాయీబ్రాహ్మణులకు నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతున్నదన్నారు. ఆధునిక దోబీఘాట్లు, ఆత్మగౌరవ భవన నిర్మాణానికి స్థలం కేటాయింపుతోపా టు నిధులు మంజూరు చేశారని, 8 ఏండ్లలో రూ.145 కోట్లు ఖర్చు చేశారన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థికి అండగా ఉంటామంటూ తీర్మానించినట్టు చెప్పారు.