మహబూబాబాద్లో దళితబంధు యూనిట్ల పంపిణీలో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి
మహబూబాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): దళితుల ఆర్థిక అభ్యున్నతి కోసం దళితబంధు అమలుచేస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభినవ కేసీఆర్ అని పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అభివర్ణించారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దళితబంధు ఆస్తుల పంపిణీ కార్యక్రమానికి గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా 79 యూనిట్లకు సంబంధించిన రూ.7.90 కోట్ల విలువైన వాహనాలను అందజేశారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ.. మరో మూడేండ్లలోగా రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు లబ్ధి చేకూర్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు.
యూనిట్లను అందుకొన్న వారు మరో పదిమందికి ఉపాధి కల్పించేలా తయారు కావాలని ఆకాంక్షించారు. దళితుల బాగు కోసం ఇంత చేస్తున్న సీఎం కేసీఆర్ను ఎవరు విమర్శించినా దళిత సోదరులు ఊరుకోవద్దని సూచించారు. అనంతరం మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కేసీఆర్ దళిత బంధు ప్రవేశ పెట్టారని అన్నారు. యూనిట్లు తీసుకున్న లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలని కోరారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవీందర్రావు, జడ్పీ చైర్మన్ అంగోతు బిందు, ఎమ్మెల్యేలు శంకర్నాయక్, రెడ్యానాయక్, హరిప్రియ, అనసూయ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నవీన్రావు తదితరులు పాల్గొన్నారు.