ములుగు : పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ సంపదన పెంచి పేదలకు పంచుతున్నారన్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
సోమవారం జిల్లా కేంద్రంలో లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..57 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికి వృద్ధాప్య పింఛన్లను అందజేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 8,424 మంది లబ్ధిదారులకు నూతన పింఛన్లను మంజూరు చేసినట్లు తెలిపారు.
కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.