హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): గ త ప్రభుత్వాలు రజకులు, నాయీబ్రాహ్మణుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఈ వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తున్నారని ఎంబీసీ రాష్ట్ర కోకన్వీనర్ కొండూరు సత్యనారాయణ కొనియాడారు. ఇప్పటికే ఉచిత కరెంటు, ఆధునిక దోభీఘాట్లు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలతో కేసీఆర్ సర్కారు వృత్తిదారులకు అండగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. తాజాగా సెలూన్ల ఆధునికీకరణకు ఆర్థికసాయం అందిస్తామని ఇటీవల మునుగోడులో మంత్రి కేటీఆర్ ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ఆదివారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.