హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ నేతృత్వం లో గురువారం క్యా బినెట్ తీసుకొన్న నిర్ణయాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. 23 వేల మంది వీఆర్ఏలను రెగ్యులరైజ్కు క్యాబినెట్ ఆమోదం తెలపడం పట్ల తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) హర్షం వెలిబుచ్చింది. ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే గౌతమ్ కుమార్, సభ్యులు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేశారు.
యావత్ వీఆర్ఏ కుటుంబాలు సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాయని రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అ న్నారు. వీఆర్ఏల రెగ్యులరైజ్కు క్యాబినెట్ నిర్ణయం హర్షించదగ్గ విషయమ ని పేర్కొన్నారు. వీరి జీవితాల్లో వెలుగులు నింపడానికి ఇప్పటికే రాష్ట్ర ప్ర భుత్వం ఇంక్రిమెంట్ ఇచ్చిందన్నారు.
కులవృత్తుల వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి రూ.లక్ష ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించడంపై బీసీ సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్కు ఫెడరేషన్ల కమిటీ రాష్ట్ర కన్వీనర్, నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలకృష్ణ, ఎంబీసీ జాతీయ కన్వీనర్ సత్యనారాయణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.