సూర్యాపేట : మహిళా ఆరోగ్యం, సాధికారతకు ముఖ్యమంత్రి కేసీఅర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేటలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో వాసవి – వనిత క్లబ్ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు కార్యక్రమానికి హాజరైన మంత్రి 104 మంది గర్భిణులకు చీరలు, పండ్లు, పూలు పంపిణీ చేసి ఆశీర్వదించారు. అనంతరం మాట్లాడుతూ.. కుల,మత భేదాలు లేకుండా ఇంతమంది పేద మహిళలకు వనిత- వాసవి క్లబ్ ఆధ్వర్యం లోసామూహిక సీమంతాలు నిర్వహించడం అభినందనీయమనిఅన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సాధికారత లక్ష్యంగా పలు పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. మహిళల అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పథకాల అమలులో రాష్ట్రం చాలా ముందుందని చెప్పారు. మహిళల హక్కులు, గౌరవాన్ని కాపాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కిట్తో ఆడబిడ్డలకు పౌష్టికాహారం అందిస్తూ.. కళ్యాణలక్ష్మి కింద ఆడపిల్లల పెళ్లి ఖర్చులు చూసుకుంటూ కుటుంబ పెద్దగా నిలిచారన్నారు.
ఇటీవల ఆడబిడ్డల కోసం తెచ్చిన ఆరోగ్య మహిళ పథకం వారీ పట్ల ముఖ్యమంత్రి కేసీఅర్కు ఉన్న ప్రేమ, అభిమానాలకు నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ ఉప్పల లలితా ఆనంద్, ఉప్పల ఆనంద్, గుండా శ్రీదేవి, రాచకొండ శ్రీనివాస్, చల్లా లక్ష్మీకాంత్, రాచర్ల కమలాకర్, తోట శ్యామ్, లక్ష్మి, వెంపటి సురేష్, తదితరులు పాల్గొన్నారు.