నిజామాబాద్ : ఇచ్చిన మాట మేరకు ఎన్ని ఇబ్బందులున్నా కొత్త పెన్షన్లు మంజూరు చేసిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలో వెయ్యి మంది లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలు అందజేశారు. లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..నిజామాబాద్ నగరం అందరూ ఆశ్చర్య పోయే విధంగా అభివృద్ధి చెంతుదున్నది. ఇందుకు ప్రభుత్వ కృషితో పాటు స్థానిక ఎమ్మెల్యే బిగాల గుప్తా కృషి ఉందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణలో 22లక్షల మందికి మాత్రమే పెన్షన్లు వచ్చేవి. కానీ, ఇపుడు పెన్షన్ల సంఖ్య 48 లక్షలకు చేరుకుందన్నారు.
నేడు 10 లక్షల కొత్త పెన్షన్లు కలుపుకొని 12 వేల కోట్ల రూపాయలు పెన్షన్ల కోసం చెల్లిస్తున్నది వాస్తవం కాదా.. ప్రజలు ఇది గమనించాలన్నారు. కాంగ్రెస్,బీజేపీ నేతలు పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలు గమనించాలన్నారు.
మనకంటే రెట్టిపు జనాభా ఉన్న గుజరాత్లో కేవలం 13 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇస్తున్నారు. కానీ మన దగ్గర 48 లక్షల మందికి ఇస్తున్నామని ఆయన గుర్తు చేశారు. అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం అన్నారు.