వనపర్తి : నాణ్యమైన విద్య అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం మణిగిల్ల గ్రామంలో అదనపు తరగతి గదులు, డిజిటల్ క్లాసులు ప్రారంభించి మాట్లాడారు.
మన ఊరు – మన బడితో రాష్ట్రంలోని పాఠశాలల్లో వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు.
కరెంట్, మరుగుదొడ్లు, ప్రహారీగొడలు, ల్యాబ్, డిజిటలైజేషన్, కుర్చీలు, బల్లలు ఏర్పాటు చేస్తామన్నారు. పాఠశాలలలో మౌలిక వసతులే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. మన ఊరు – మన బడి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యంతో పాటు దాతలు,
ఎన్ఆర్ఐలు, పూర్వపు విద్యార్థులు, స్థితిమంతులు ముందుకురావాలన్నారు. గ్రామాల్లో ప్రతి వానాకాలం, పుట్టినరోజు నాడు విద్యార్థులు ఒక మొక్క నాటాలన్నారు. ఎంపీపీ మేగారెడ్డి వితరణతో మండలంలోని అన్ని గ్రామాల విద్యార్థులకు టై, బెల్టులు పంపిణీ చేశారు.