మోతె, మే 4 : కరోనా నిబంధనలు పాటిస్తూ కూలీలు ఉపాధి హామీ పనులు చేయాలని డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్ సూచించారు. మంగళవారం మండలంలోని రాఘవాపురం, భల్లుతండా, బీక్యాతండా, రాఘవాపురం ఎక్స్రోడ్డులో ఉపాధి హామీ పనులు, పల్లె ప్రకృతి వనం, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీలు రోజు వారీ వేతనం పొందేలా పని కల్పించాలన్నారు. ఎంతమేరకు పని చేస్తే కనీస వేతనం పొందుతారో కూలీలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. పని ప్రదేశం వద్ద కూలీలు తప్పకుండా మాస్కులతోపాటు భౌతికదూరం పాటించాలని సూచించారు. ఎండ ప్రభావం ఎక్కువగా ఉండడంతో పల్లె ప్రకృతి వనాల్లోని మొక్కలకు నీరు పోయాలన్నారు. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీడీఓ శంకర్రెడ్డి, ఏపీఓ వెంకన్న, సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
మేళ్లచెర్వు : కొవిడ్ నిబంధనలు పాటిస్తూ గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కల్పించాలని ఇన్చార్జి ఎంపీడీఓ జోగు శ్రీనివాస్రెడ్డి సూచించారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో గ్రామాల్లో నిరంతరం శానిటేషన్ చేపట్టాలని ఆదేశించారు. అంతకుముందు మేళ్లచెర్వు ఎన్నెస్పీ కాల్వలో కంపచెట్లు, పూడికతీత పనులను పరిశీలించారు. కూలీలు విధిగా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటిస్తూ పనులు పూర్తి చేయాలన్నారు. ఎంపీఓ వీరయ్య, ఏపీఓ రాజు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.