వనపర్తి : జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న చిట్యాలలో వ్యవసాయ మార్కెట్ యార్డును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డితో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నాయకులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డు వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్కు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.