హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలను ప్రగతి భవన్లో (Pragathi Bhavan) ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, ప్రగతి భవన్ అధికారులు పాల్గొన్నారు.
అనంతరం గన్పార్క్లోని అమర వీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించనున్నారు. అక్కడినుంచి సచివాలయానికి చేరుకుంటారు. జాతీయ జెండా ఎగురవేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభిస్తారు.