హైదరాబాద్, జూన్ 2( నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్ గురువారం ఉదయం ప్రగతిభవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గన్పార్క్కు చేరుకొని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీ సంతోష్కుమార్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ‘నమస్తే తెలంగాణ’ ఎండీ దీవకొండ దామోదర్రావు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, సీపీ సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. శాసనసభ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసనమండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీలు గంగాధర్గౌడ్, రఘోత్తంరెడ్డి, ఎల్ రమణ, దండె విఠల్, టీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణభవన్లో టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్రెడ్డి తెలంగాణతల్లి విగ్రహంతో పాటు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం జాతీయజెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, పార్టీ సీనియర్ నేతలు పర్యాద కృష్ణమూర్తి, బండి రమేశ్, కరిమిళ్ల బాబూరావు, నాయినేని రాజేశ్వర్రావు, బొమ్మెర రామ్మూర్తి, అలీబాక్రీ తదితరులు పాల్గొన్నారు.