కోల్కతా : పశ్చిమ బెంగాల్ బీజేపీలో సంక్షోభం ముదిరిపోతున్నది. ఎన్నికలు జరిగిన తర్వాత సువేందు అధికారిని బీజేపీఎల్పీ నేతగా ప్రకటించినప్పటి నుంచి పార్టీలో ముసలం మొదలైంది. సోమవారం సాయంత్రం గవర్నర్తో భేటీ సమయంలో దాదాపు 24 మంది బీజేపీ ఎమ్మెల్యేలు గైర్మాజరుతో ఈ వాదనకు మరింత బలం చేకూరిందంటున్నారు రాజకీయ నిపుణులు. వీరంతా తృణమూల్ కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారనే ఊహాగానాలు కూడా తీవ్రమయ్యాయి.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన చాలా మంది తిరిగి సొంతింటికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తున్నది. ఇటీవల ముకుల్రాయ్ టీఎంసీలో చేరడంతో బీజేపీ టికెట్పై గెలిచిన వారిలో చాలా మంది తిరిగి టీఎంసీ వైపు చూస్తున్నట్లుగా ఊహాగానాలు జోరందుకున్నాయి. రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంఖర్తో బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి, పార్టీ ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం రాజ్ భవన్లో సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి దాదాపు 24 మంది ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. దీంతో వీరంతా టీఎంసీ చేరబోతున్నారనే వదంతులు వినిపిస్తున్నాయి.
ఎన్డీటీవీ నివేదిక ప్రకారం, రాష్ట్రంలో జరుగుతున్న అనేక హింసాత్మక, తప్పుడు సంఘటనల గురించి గవర్నర్కు తెలియజేసేందుకు బీజేపీ నాయకుల బృందం గవర్నర్తో సమావేశమైంది. ఈ సమావేశానికి 74 మంది బీజేపీ ఎమ్మెల్యేలకుగాను 24 మంది గైర్హాజరయ్యారు. బీజేపీ ఎమ్మెల్యేలు సువేందును తమ నాయకుడిగా అంగీకరించడం లేదనేది కూడా దీనికి ఒక కారణమై ఉంటుందని నిపుణులు అంటున్నారు.
చరిత్రలో ఈరోజు : గల్వాన్ వీరులకు వందనం
గోర్లను చూసి డయాబెటిస్ ఉందా లేదా గుర్తించొచ్చు.. అదెలానో మీరూ తెలుసుకోండి.!
ప్రోటీన్ వనరు : రోగనిరోధక శక్తి కోసం సోయా ఫుడ్స్ ఉత్తమం
బహు భార్యత్వానికి మద్దతు.. లా ప్రొఫెసర్కు ఇక్కట్లు
ఆంక్షల పొడగింపు : బ్రిటన్ను భయపెడుతున్న డెల్టా వేరియంట్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..