హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సమైన ‘మిలాద్ ఉన్ నబీ’ని పురసరించుకొని ముస్లింలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలిపారు. సర్వమానవ సమానత్వం, శాంతిస్థాపనే లక్ష్యంగా సాగిన మహ్మద్ ప్రవక్త బోధనలతో స్ఫూర్తి పొందాలన్నారు. దేశంలో శాంతి, సామరస్యాలను పెంపొందించేందుకు మరింతగా కృషి జరగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.