హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రేపు(శుక్రవారం) వరంగల్లో పర్యటించనున్నారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. సీఎం పర్యటన వివరాలిలా ఉన్నాయి. ఉదయం 11 గంటలకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, సుబేదారికి సీఎం హెలికాప్టర్లో చేరుకుంటారు. అక్కడినుంచి రాజ్యసభ ఎంపీ కెప్టెన్ లక్ష్మికాంతరావు ఇంటికి వెళ్లనున్నారు. అక్కడినుంచి బయల్దేరి సెంట్రల్ జైలును సందర్శించనున్నారు. కెప్టెన్ ఇంట్లోనే మధ్యాహ్న భోజనం చేయనున్నారు. అనంతరం ఎంజీఎం ఆస్పత్రిని సందర్శిస్తారు. అక్కడ కొవిడ్ రోగులను సీఎం పరామర్శించి మాట్లాడనున్నారు. ఇక్కడి నుంచి తిరిగి కెప్టెన్ ఇంటికి చేరుకుని కాసేపు విశ్రాంతి అనంతరం తిరిగి హెలిపాడ్ వద్దకు చేరుకుని హైదరాబాద్కు బయల్దేరి వెళ్లనున్నారు.