CM KCR | హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) కాందార్ లోహా( Kandhar Loha ) పర్యటనకు ప్రగతి భవన్( Pragathi Bhavan ) నుంచి బయల్దేరారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్.. మహారాష్ట్రలోని నాందేడ్( Nanded )కు చేరుకుంటారు.
అక్కడి నుంచి ప్రత్యేక హెలిక్యాఫ్టర్లో బయలుదేరి లోహా పట్టణ శివారులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. లోహాలోని ఓ బీఆర్ఎస్ అభిమాని ఇంట్లో తేనీటి విందులో పాల్గొంటారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్లో బయలుదేరి నేరుగా పట్టణంలోని బైల్ బజార్ సభాప్రాంగణానికి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు సభా ప్రాంగణంలో కేసీఆర్ ప్రసంగించనున్నారు.