మహబూబ్నగర్ : ఇటీవల రెండు శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలలో, తాజాగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితంతో తెలంగాణ సమాజం కేసీఆర్, టీఆర్ఎస్ వెంటే ఉన్నట్లు స్పష్టమయిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
ఈ ఎన్నికల సరళిని విశ్లేషిస్తే కాంగ్రెస్, బీజేపీలు టీఅర్ఎస్కు అసలు పోటీ కాదు, కాలేదని తేటతెల్లం అయిందన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆరే తమ నాయకుడు అని, వారి నాయకత్వం మీదనే తమ నమ్మకం అని నిరూపించారు. సాగర్ ఎన్నికలలో టీఆర్ఎస్ పక్షాన నిలిచిన ఓటర్లందరికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
భార్యను వేట కొడవలితో నరికి చంపిన భర్త
బైక్ను ఢీకొట్టిన లారీ..ఆర్ఎస్ఐ మృతి
రంజాన్ కిట్లను పంపిణీ చేసిన మంత్రి అల్లోల
సీనియర్ ఫొటోగ్రాఫర్ సలీం మృతి పట్ల మంత్రి వేముల సంతాపం