హైదరాబాద్ : నీతి ఆయోగ్ చేసిన సిఫారసులే బుట్టదాఖలైన పరిస్థితేంటని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. శనివారం ఆయన ప్రగతిభవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రం తీరుపై ధ్వజమెత్తారు. ‘ఇవాళ నీతి ఆయోగ పరిస్థితి ఏంటంటే.. మేం అడుగలే.. మేం సిఫారసు చేయలే.. వాళ్లంతట వాళ్లే తిరిగి.. చూసి ఈ రెండు స్కీమ్లు దేశానికి ఆదర్శంగా ఉన్నాయన్.. మిషన్ కాకతీయ పథకం చాలా మంచిది.. భూగర్భజలాలు, బయోడైవర్సిటీని, జీవవైవిధ్యాన్ని పెంచుతుందని ఆలోచించి ఒక రూ.5వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేసింది.
అట్లే మిషన్ భగీరథ చాలా మంచి కార్యక్రమం. ప్రతి ఇంటికీ ఐదుసంవత్సరాల కాలపరిమితి లోపట ట్రీటెడ్ పోర్టెబుల్ డ్రింకింగ్ వాటర్ అందించబడుతుంది. ఇది మంచి ప్రోగ్రామ్ తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది.. దీనికి రూ.19వేలకోట్ల రూపాయలు ఇవ్వండి.. రెండింటికి కలిపి రూ.24వేలకోట్లు ఇవ్వాలని నీతియోగ్ సుమోటోగా ప్రధానమంత్రికి స్వయంగా రెకమండ్ చేసింది. వాళ్లు చేసిన ఐదున్నర, ఆరేళ్లు గడిచిపాయే. రూ.24వేలకోట్లు ఇవ్వమంటే.. 24 పైసలు కూడా ఇవ్వలే. మరి నీతి ఆయోగ్ రెకమండేషన్ బుట్టదాఖలైతే దానికున్న విలువేంటి? ఇగ. ఇది నీతి ఆయోగ్కు అవమానం కాదా?’ అంటూ మండిపడ్డారు.
‘నీతి ఆయోగ్కు కొన్ని ఉపసంఘాలు వేయమని చెప్పాం. చాలా లోతైన అధ్యయనం జరగాలి. దేశాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలి. చాలా ప్రధానమైన బాధ్యతల్లో ఉన్న నీతి ఆయోగ్ గొప్ప ఆలోచన చేయాలని చెప్పి ఉప సంఘాలు వేసి.. ముఖ్యమంత్రుల బృందాలు వేయాలని చెప్పాం.. ఆ ప్రయత్నం జరుగలే. ఒక బృందం వేస్తే గాచారం బాగలేక నేను కూడా దాంట్లో మెంబర్గా ఉన్న. పైసలు ఖర్చుపెట్టుకొని అప్పటి చీఫ్ సెక్రెటరీ రాజీవ్శర్మ కలిసి భోపాల్కు వెళ్లి అక్కడ సమావేశంలో పాల్గొన్నం. చాలా గంటల సమయం వెచ్చించి.. మంచి సలహాలు ఇచ్చాం. అందులో అతిముఖ్యమైన సలహా ఏంటంటే.. ఈ దేశం విశాలమైంది కాబట్టి.. ఒకే రకంగా లేదు.. భిన్నమైన భౌగోళిక పరిస్థితులున్నయ్.. మనకు శీతల
వాతావరణమున్నటువంటి ప్రాంతాలున్నాయ్.
కశ్మీర్, మహిమాచల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్లోని ప్రాంతాలు, ఉత్తరాఖండ్ కావొచ్చు.. ఇట్ల శీతల ప్రాంతాలున్న రాష్ట్రాలున్నయ్. అట్లనే సముద్రతీరమున్న ప్రాంతాలున్నయ్. ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ మధ్యప్రదేశ్, తెలంగాణ.. ఏ తీరం లేకుండా చుట్టూ భూమిచేతనే ఉన్న రాష్ట్రాలు కూడా ఉన్నయ్. కొన్ని ఉష్టోగ్రతలు ఉండే ప్రాంతాలున్నయ్. భిన్నమైన ఆగ్రో క్లైమెటిక్ కండిషన్స్ ఉన్నయ్. ఖనిజం అంతటా దొరకదు. కర్నాటక కోలార్ జిల్లాలో బంగారు గనులు ఉన్నయ్. అలాగే బొగ్గు నిక్షేపాలు అంతటా ఉండవ్. ఇలా రకరకలుగా ఉంటయ్.. వాటన్నింటిని దేశ ప్రగతికి ఉపయోగపడేలా ఉండాలంటే.. అన్నింటిన్ని దృక్పథంగా పెట్టుకొని సమగ్రమైన దృక్పథంతో ఆలోచించాలని చెప్పాం’ అన్నారు.
‘కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఏమైతే ఉంటయో.. అవి మహత్తరంగా ఉండవ్.. అతి తక్కువ ఉంటయ్. అవి రాష్ట్రాలకే ఇవ్వాలే.. ఎందుకంటే రాష్ట్రాలు స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్. స్టేట్స్ స్పెసిఫిక్ ఇష్యూలు ఉంటయ్.. సముద్రతీరం ఉన్నవద్ద ఒక సమస్యలు.. కోల్డ్ వాతావరణం ఉన్నకాడ ఒకరకమైన సమస్యలుంటయ్.. హీట్ వెదర్ ఉన్నకాడ ఒకరకమైన సమస్యలుంటయ్. రాజస్థాన్లాంటి ఎడారి రాష్ట్రం ఉంటే వారి సమస్య ఒక రకంగా ఉంటుంది. వాళ్ల ప్రాధాన్యతలు అందరి కంటే వాళ్లకు ఎక్కువ తెలుస్తయ్.. ఒక చోట బోధకాలు వ్యాధి, ఒకచోట టీబీ వ్యాధి ఎక్కువ ఉంటది.. అన్నింటికీ ఒకటే మందంటే కలువది కదా..? ఇలా స్టేట్స్ స్పెసిఫిక్గా ఉండాలని చెబితే.. మంచి ప్రతిపాదన అంగీకరిద్దామన్నారు ప్రధాని అందరి ముందర. కానీ ఆచరలో సున్నా.. అది మొత్తం బంద్పెట్టి.. మేం చెప్పిందే చెయ్యాలి.. లేకుంటే మీ కథ చూస్తాం అనే కాడికి వచ్చింది ఇప్పుడు’ అంటూ ధ్వజమెత్తారు.
‘కో ఆపరేటివ్ ఫెడరలిజం పోయింది.. ఇంపరేటివ్ డిక్టేటరిజమ్ వచ్చింది. చివరి ఎక్కడికి వచ్చింది.. ముఖ్యమంత్రులే బుల్డోజర్లు పెట్టి కూలగొడుతమ్ మీ ఇండ్లను అంటున్నరు.. కూలగొడుతూనే ఉన్నరు కొందరు.. రాష్ట్రాల్లో మంత్రులుగా ఉండే వాళ్లు ఎన్కౌంటర్లు చేసేందుకు వెనుకాడం అని మాట్లాడే పరిస్థితులు. భగవంతునిపై పేరిట జరిగే ఉత్సవాల్లో దేశ రాజధానిలో కత్తులు, గదలు, కటార్లు పట్టుకొని తిరిగే పరిస్థితి. గత హన్మాన్ జయంతి నాడు ఢిల్లీ నడిబొడ్డులో పట్ట పగలు.. 11 గంటలకు కత్తులు పట్టుకొని స్వైర విహారం చేస్తున్నారు.. ఇదేనా నీతి ఆయోగ్ ఇచ్చిన సందేశం. ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సందేశం. ఏం జరుగుతుంది ఏ దేశంలో.. అన్ని రంగాల్లో సర్వనాశనమైంది దేశం. చాలా వెనుకబడింది ఇండియా.
అంతర్జాతీయ విఫణిలో మన పరువుపోతుంది రోజురోజుకు.
ఆర్థికవేత్తలు రఘురామరాజన్, కౌశిక్ బసు.. ఇంకా ఎంతో మంది పెద్దలు ప్రతి హెచ్చరిస్తున్నరు.. కేంద్రానికి లెటర్లు రాస్తున్నరు.. ఒక్కరిని పిలిచింది లేదు.. మాట్లాడింది.. లేదు. ప్రధాని మంత్రి పిలువరు.. నీతి ఆయోగ్ పిలువదు.. నీతి ఆయోగ్ ఎజెండా రూపకల్పనలో కో ఆపరేటివ్ ఫెడరలిజం ఎక్కడ పోయిందో.. కాకి ఎత్తుకుపోయింది.. నీతి ఆయోగ్ ఎజెండా రూపకల్పనలో ఎవరికీ భాగస్వామ్యం లేదు. ఎవరు తయారు చేస్తరో.. ఎక్కడ తయారు చేస్తరో ఎవరికి తెలియదు. ఈ సారి ప్రముఖమైన సమస్యలున్నయ్ ? దేశంలో ఎందుకు ధరలు పెరుగుతున్నయ్.. ద్రవ్యోల్బణం ఎందుకు పోతున్నది. రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది? అందరం కలిసి ఏం చేద్దాం అనే ముచ్చటే లేదు.. అసలే లేదు. ఇది చిల్లర రాజకీయం కాదు.. ఇది దేశ ప్రజలకు తెలియాలని చెబుతున్నా. ఆవేదనతో చెబుతున్నా’ అని అన్నారు.
‘దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతున్నది రోజు రోజుకు. పన్నులు వసూలు చేసే పద్ధతుల్లో రాజ్యాంగం నిర్దేశించింది. ఈ పన్నులు కేంద్రం వసూలు చేయాలి.. ఈ పన్నులు రాష్ట్రాలు వసూలు చేయాలని ఎవరి బాధ్యతలు వారికి పెట్టింది. కొన్ని రకాల పన్నుల్లో రాష్ట్రాల వాటా ఇవ్వాలి.. రాజ్యాంగబద్ధమైన హక్కు. ఈ నీతి ఆయోగ్ సృజన.. మాన్య ప్రధాని యొక్క మేధోసంపత్తి ఏం చేస్తున్నరండి? రాష్ట్రాల పన్నుల వాటా ఎంత తెలివిగా ఎగ్గొట్టొచ్చు అని.. ఆలోచన చేసి.. టాక్స్లకు సెస్సు అని పేరు పెట్టి రాష్ట్రాల యొక్క దాదాపు 12-13లక్షలకోట్ల రాష్ట్రాలకు పంచాల్సిందాన్ని.. పన్నుకు సెస్సు అని పేరుపెట్టి మార్చి.. రాష్ట్రాల వాటాను ఎగ్గొడుతున్నరు. ఇప్పటి వరకు 13-14లక్షలకోట్లు ఎగ్గొట్టారు.. ఇదేనా కో ఆపరేటివ్ ఫెడరలిజం.. ఇది సహకార సమాఖ్య స్ఫూర్తా? దోపిడీ స్ఫూర్తా? రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకు సంక్రమించిన హక్కులను ఒక
ట్వీక్ చేసి రాష్ట్రాలకు రావాల్సిన వాటాను కొల్లగొడుతారా? అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
‘దీన్ని కో ఆపరేటివ్ ఫెడరలిజం అంటారా? ఇది టీమ్ ఇండియేనా? దీన్ని టీమ్ఇండియా అంటారా? ఇది ధర్మమేనా? దీన్నే కో ఆపరేటివ్ ఫెడరలిజం అంటారా? దీన్నే టీమ్ ఇండియా చేసే పనేనా? ఏ నీతి ఆయోగ్ మీటింగ్లో దీనిపై చర్చ పెడుతారా? అసలు చర్చకు ఆస్కారం ఉంటదా? ఆ మీటింగ్కు పోతే అగో భజనమండలి.. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకు గిన్ని నిమిషాలు మాట్లాడాలి అని లెక్కపెట్టి బెల్లు కొడుతరు.. మూడు రోజులు కాకపోతే నాలుగు రోజులు పెండండి.. ఇంతక కంటే పెద్ద పనులేముంటయ్..
ఎవరన్నా రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడితే మిగతా వాళ్లు నవ్వుతుంటరు.. అందుకు బాధపడి చెబుతున్న బాధపడి.. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు ఎట్లా ఉండే అంటే.. రాష్ట్రాల బడ్జెట్ల ఆమోదం కోసం పోతే.. రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు, సెక్రెటరీలు, అవసరమైన సందర్భాల్లో ముఖ్యమంత్రులు వెళ్లి.. ఢిల్లీలో వారం వారం రోజులుండి.. రోజుల తరబడి ప్రణాళిక సంఘం చర్చలు జరిపేది. ఏదైనా తప్పుంటే మా పరిస్థితి? మా ప్రాధాన్యత ఇది.. అని చెప్పి ప్లానింగ్ కమిషన్ను ఒప్పించి నిధులు అలాట్ చేయించుకునేది లేదు. అంత వెసులుబాటు ఉండేది’ అన్నారు.
‘ఇప్పుడు ఎజెండా ఎవరు తయారు చేస్తారో? పాలసీ ఎవరు తయారు చేస్తారో.. ఎవరు ఆర్డర్లు ఇస్తరో తెలియని పరిస్థితి. నీతి ఆయోగ్ తనకు తానుగా ఆలోచించి సిఫారులకు కనీస గౌరవం ఉంటుందా? అదీ లేదు. చివరికి ఎంత దౌర్భాగ్యమంటే.. ముఖ్యశిఖామనులు తను కూసున్న కొమ్మను తానే నరుక్కుంటరన్నట్లు.. ఇవాళ కేంద్ర చేసే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రాల ప్రగతిని మొత్తం దెబ్బతీస్తున్నాయి. నీతి ఆయోగ్ తొలి సమావేశం నుంచి మొదలుకొని ప్రతీ సమావేశంలో నేను నొక్కి వక్కానించా.. డోంట్ కర్టేయిల్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ద ఫర్ఫామింగ్ స్టేట్స్.. ప్రోగ్రెసింగ్ స్టేట్స్. ఈ దేశంలో ఏ ఒక ఇంచులో జరిగే ప్రగతిని ఆపినా ఈ దేశ ప్రగతికి గొడ్డలి పెట్టు తెలివి తక్కువ తనం అవుతుంది.
బాగా దూసుకుపోతున్నటువంటి మంచి నైపుణ్యంతో పని చేస్తున్న రాష్ట్రాల కాళ్లలో కట్టెలు పెట్టకండి.. వాళ్లను ప్రోత్సహించండి.. తద్వారా దేశం బాగుపడుతుందని చెప్పాం. ఒక సమావేశంలో 25 నిమిషాలు మాట్లాడుతనని ముందే చెప్పి.. తెలంగాణ ఒక గురించి ఒకటి రెండు నిమిషాలు.. మిగతా అంతా దేశం గురించి చెప్పా.. దేశంలో 24 గంటల కరెంటు ఎట్లా ఇవ్వచ్చో.. దేశంలో ప్రతి ఎకరానికి నీళ్లు ఎట్లా ఇవ్వచ్చో సోదహరణంగా.. అధికారిక లెక్కలతో చెప్పా? సమావేశమైన తర్వాత పది పదిహేను రాష్ట్రాల సీఎస్లు వచ్చి నన్ను కంగ్రాజ్యులేట్ చేశారు’ అన్నారు.