హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు సీఎం కేసీఆర్ చురకలంటించారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. దిక్కు మాలిన పాదయాత్ర చేసుకుంటూ.. కేసీఆర్ నీ ఫామ్ హౌజ్కు వచ్చి దున్నుతా అంటడు. ఏం దున్నుతావ్.. నీవు ట్రాక్టర్ డ్రైవర్ వా? నా ఫామ్ హౌజ్ దాసిపెట్టేందుకు అదేమైనా అగ్గిపెట్టేనా? వంద ఎకరాల్లో నేను, నా కొడుకు బాజప్తాగా వ్యవసాయం చేసుకుంటున్నాం.
మాకేం మనీలాండరింగ్లు, బొండరింగ్లు లేవు. మాకేం కంపెనీలు లేవు. దందాలు లేవు. మాకేం బిజినెస్లు లేవు. దొంగ వ్యాపారాల్లేవు. నాకేం లేవు. మీరు మమ్మల్ని ఏం చేయలేరు. అది కూడా చెప్తున్నా.. జ్ఞాపకం పెట్టుకో. ఏమంటే ఏం చేయలేరు. నిటారుగా ఉన్నాం.. నిఖార్సుగా ఉన్నాం. ఎవరితోనైనా పోరాడుతాం. ఎవరికీ భయపడం. ఇంకోమాట కూడా హెచ్చరిస్తున్నా. పిడుగు, పెళ్లికి, చావుకు అదే మంత్రం అంటే నడ్వదు. అనవసరమైన ప్రయత్నాలు చేస్తే బూమర్ హ్యాంగ్ అయితది. నేను సూట్ కేసులు ఇచ్చినాను. ఈ దేశంలో డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టే పార్టీ బీజేపీనే అని సీఎం కేసీఆర్ అన్నారు.