హైదరాబాద్ : నార్త్ సిక్కింలోని జైమా వద్ద, విధి నిర్వహణలో వున్న ఆర్మీ అధికారులు, జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం, ప్రమాదవశాత్తూ లోయలో పడిన ఘోర ప్రమాదంలో, ప్రాణ నష్టం జరగడం, పలువరు తీవ్రంగా గాయపడడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో 16 మంది జవాన్లు మృతి చెందడం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆర్మీ జవాన్లు, అధికారుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ తన సానుభూతిని తెలిపారు. మృతి చెందిన జవాన్ల కుటుంబాలను ఆదుకోవాలని, క్షతగాత్రులకు తగు విధంగా వైద్యసేవలందించాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరారు.