హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు, మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని సర్కారీ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
ఈ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది అని టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. ఫీజులను నియంత్రించడం, ఆంగ్ల మాధ్యమం ద్వారా పేదలకు, సామాన్య మధ్యతరగతికి విద్యను మరింత చేరువ అవుతుందన్నారు.
మన ఊరు–మన బడి అనేది కేసీఆర్ ఆలోచనలకు తార్కాణం అన్నారు. చిన్నప్పటి నుంచే ఆంగ్ల భాషలో చదవటం వాళ్ళ సామాన్యులకు ఫై చదువులకి వెళ్లిన ఎలాంటి ఇబ్బందులు వుండవు అని, కేసీఆర్ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.