సింగరేణి కార్మికులకు దసరా పండుగ ముందే వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సంస్థ లాభాల్లో 32శాతం వాటా కార్మికులకు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ నిర్ణయంలో ఒక్కో కార్మికుడికి 1.65 లక్షలు బోనస్గా లభించనుంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): సింగరేణి కార్మికులకు ఎన్నడూ లేనివిధంగా సంస్థకు వచ్చిన లాభాల్లో 32 శాతం వాటా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ను ఆదేశించారు. సమైక్య రాష్ట్రంలో నష్టాలనే చవిచూసిన సింగరేణి సంస్థ.. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో లాభాల బాట పట్టింది. దీనికితోడు థర్మల్, సౌర విద్యుత్తు ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించిన సింగరేణి ఏటికేడు లాభాలను ఆర్జిస్తున్నది. ఇప్పటివరకు అత్యధికంగా 2018-19లో రూ. 1763.66 కోట్ల నికర లాభాలను సంస్థ ఆర్జించగా.. ఇప్పుడు దానిని కూడా అధిగమించి ఏకంగా రూ. 2,222 కోట్లకుపైగా పొందింది. ఇందులో 32 శాతం అంటే.. 711.19 కోట్లను లాభాల్లో వాటాగా 3వ పేజీలో
కార్మికులకు ఇవ్వనున్నారు. ఇది సింగరేణి చరిత్రలోనే అత్యధికం కావడం విశేషం. సింగరేణిలో ఉన్న ఒక్కో కార్మికుడికి సగటున రూ. 1.65 లక్షల మొత్తం వస్తుందని అంచనా. తెలంగాణ వచ్చిన తరువాత 2018-19లో అత్యధికంగా ఒక్కో కార్మికుడికి సగటున రూ.లక్షకుపైగా చెల్లించారు. ఇప్పుడు దానిని తిరగరాసి సుమారు రూ. 1.65 లక్షల వరకు చెల్లిస్తుండటం గమనార్హం. సీఎం నిర్ణయంపై సింగరేణి కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సీఎం సహృదయతకు నిదర్శనం: ఎన్ శ్రీధర్, సీఎండీ
మొదటి నుంచి సింగరేణి కార్మికులు అంటే సీఎం కేసీఆర్కు ప్రత్యేక అభిమానం. సింగరేణిని బలోపేతం చేసేందుకు, ఆర్థికంగా బలపడేందుకు చర్యలు తీసుకున్నారు. సంస్థకు వచ్చిన లాభాలను కార్మికులకు పంచేలా సీఎం నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ యేడు 32 శాతం లాభాలు పంచాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. అందుకు ప్రత్యేకంగా సింగరేణి తరఫున కృతజ్ఞతలు. ఈ యేడు సింగరేణి కార్మికుల జీవితాల్లో, జీతాల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది. మొన్ననే వేతన బకాయిలుగా రూ. 1450 కోట్లను చెల్లించాము. ఇప్పుడు లాభాల్లో వాటాగా రూ. 711 కోట్లకుపైగా చెల్లించనున్నాం. అలాగే దీపావళి బోనస్నుకూడా త్వరలోనే (కేంద్రం నిర్ణయించినదాని ప్రకారం) చెల్లిస్తాం.