హైదరాబాద్ : టోక్యో ఒలింపిక్స్లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న పీవీ సింధుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అభినందనలు తెలిపారు. వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలను సాధించిన మొదటి భారత మహిళా క్రీడాకారిణిగా పివీ సింధు చరిత్ర సృష్టించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ఈ మెగా ఈవెంట్లో రెండు మెడల్స్ గెలిచిన తొలి భారత మహిళగా ఆమె నిలిచింది. ఆదివారం చైనాకు చెందిన హి బింగ్జియావోతో జరిగిన మ్యాచ్లో సింధు 21-13, 21-15 తేడాతో వరుస గేమ్స్లో విజయం సాధించింది. దీంతో సింధు ఖాతాలో మరో బ్రాంజ్ మెడల్ చేరింది. 2016 రియో ఒలింపిక్స్లోనూ సింధు సిల్వర్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే.