హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు ఐదు గ్రీన్ యాపిల్ అవార్డులు రావడంపై ఎంఏయూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్కుమార్ను సీఎం కేసీఆర్ అభినందించారు. అర్వింద్ లండన్లో అందుకున్న అవార్డులను బుధవారం ప్రగతి భవన్లో సీఎంకు అందించి పర్యటన విశేషాలను వివరించారు.
తెలంగాణ కట్టడాలకు అంతర్జాతీయ వేదిక మీద అందుకున్న ప్రశంసలు, ప్రత్యేకతలను సీఎంకు తెలిపారు. ఈ సందర్భంగా అర్వింద్కుమార్ను సీఎం కేసీఆర్ మరోసారి అభినందించారు.