హైదరాబాద్: మాజీ ఎంపీ జంగారెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
హనుమకొండ మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి శనివారం ఉదయం కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నగరంలోని ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందారు. జంగారెడ్డి స్వస్థలం వరంగల్ జిల్లా పరకాల.
1935లో పరకాలలో జన్మించిన ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేగా, ఎంపీగా సేవలు అందించారు. 1984లో ఎనిమిదో లోక్సభకు హనుమకొండ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో పీవీ నరసింహారావుపై విజయం సాధించారు.