హైదరాబాద్: నటుడు నందమూరి తారకరత్న మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మనమడు, నందమూరి మోహనకృష్ణ పెద్ద కుమారుడు నందమూరి తారకరత్న (40) శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గత నెల 27న ఏపీలోని కుప్పంలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్నకు గుండెపోటు రావడంతో స్థానికంగా చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి గుండె, మెదడుకు సంబంధించిన చికిత్స అందిస్తున్నారు. 23 రోజులపాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకు కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నారు. తారకరత్న మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
తారకరత్న మరణం సినీ రంగానికి తీరని లోటని మంత్రి హరీశ్ రావు కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మృతిపట్ల మంత్రలు వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని వ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఏపీ సీఎం జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.
Deeply saddened to know the demise of actor Nandamuri Taraka Ratna.
Heartfelt condolences to his family and friends at this time of grief. May his Soul Rest in Peace.Om Shanti🙏🏾 pic.twitter.com/XRn28J6afq
— Harish Rao Thanneeru (@BRSHarish) February 18, 2023
తారకరత్న మృతికి నటుడు మహేశ్ బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. సోదరా.. నీ అకాల మరణం నన్నెంతగానో బాధించింది. ఈ దుఃఖ సమయంలో నా ఆలోచనలన్నీ నీతోనే ఉన్నాయి. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అని అన్నారు.
Shocked and deeply saddened by the untimely demise of #TarakaRatna. Gone way too soon brother… My thoughts and prayers are with the family and loved ones during this time of grief. 🙏
— Mahesh Babu (@urstrulyMahesh) February 18, 2023
తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన మరణం చాలా బాధాకరమన్నారు. గత మూడు వారాలుగా బెంగళూరులోని దవాఖానలో చికిత్స పొందుతున్న తారకరత్న కోలుకుంటారని భావించా. ఆయన నటుడిగా రాణిస్తూనే ప్రజా జీవితంలో ఉండాలనుకున్నారు. ఆ ఆశలు నెరవేకుండా తుదిశ్వాస విడవటం దురదృష్టకరం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తారకరత్న మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన మృతివార్త తనను ఎంతో కలచివేసిందన్నారు. చాలా ప్రతిభ ఉన్న నటుడని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Deeply saddened to learn of the
tragic premature demise of #NandamuriTarakaRatna
Such bright, talented, affectionate young man .. gone too soon! 💔 💔
Heartfelt condolences to all the family members and fans! May his Soul Rest in Peace! శివైక్యం 🙏🙏 pic.twitter.com/noNbOLKzfX— Chiranjeevi Konidela (@KChiruTweets) February 18, 2023