వరంగల్ : ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) సందేశాన్ని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను(Government Programmes) ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్(Minister Errabelli) కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్(BRS) పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు ఘనంగా నిర్వహించాలని సూచించారు. మంగళవారం
ఉమ్మడి జిల్లా ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించారు.
దేశంలో నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రభుత్వ హయాంలో పెరిగిన పెట్రోల్(Petroll) ధరలతో పాటు నిత్యవసర సరుకుల ధరలు, మోదీ ప్రభుత్వ విధానాల వైఫల్యాలు ప్రచారం చేయాలని మంత్రి కోరారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అటు దేశ ప్రజలతో పాటు, తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాలను వివరించాలని సూచించారు.
పార్టీకి కార్యకర్తలే దేవుళ్లని వారిని కాపాడుకోవలసిన బాధ్యత పార్టీ ప్రతినిధులపై ఉందని అన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(Minister KTR) ఆదేశాల మేరకు గ్రామాలు, మండలాలు, నియోజకవర్గ స్థాయిల వారీగా నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళనాలు, వాటి ఏర్పాట్లపై చర్చించారు. ఈ సమీక్షలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, ఎమ్మెల్యేలు రాజయ్య, ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, వొడితెల సతీశ్ కుమార్, వివిధ కార్పొరేషన్ల చైర్మెన్లు వాసుదేవ రెడ్డి,నాగుర్ల వెంకటేశ్వర్లు, మార్నేని రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.