రాష్ట్ర వైద్య రంగంలో అనేక అద్భుత కార్యక్రమాలు చేసుకొని, చాలా పురోగమించాం. ఒక్క మాటలో వివరించాలంటే 2014లో వైద్యరంగానికి బడ్జెట్ కేటాయింపులు రూ.2,100 కోట్లు మాత్రమే. 2023-24లో కేటాయింపులు రూ.12,367 కోట్లు. దీన్ని బట్టే వైద్యరంగంలో తెలంగాణ పురోగమనం అర్థమవుతుంది.
– సీఎం కేసీఆర్
CM KCR | హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్యశాఖ అత్యధిక ప్రాధాన్యం కలిగిన శాఖ అని, ఈ రంగాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేవరకు రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల, తపన కొనసాగుతూనే ఉంటాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. క్వెస్ట్ ఫర్ ఎక్స్లెన్స్ నెవర్ ఎండ్స్ (శ్రేష్ఠత కోసం పడే తపన నిరంతరమైనది) అని తేల్చి చెప్పారు. నిమ్స్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించే ‘దశాబ్ది బ్లాక్’కు సీఎం కేసీఆర్ బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యారోగ్యరంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. కరోనా కష్టకాలంలో డాక్టర్లు, నర్సులు, సిబ్బంది ఉన్నతాధికారుల పనితీరు గొప్పగా ఉన్నదని కొనియాడారు. ఎంతచేసినా వైద్యశాఖకు విమర్శలే మిగులుతాయని, కానీ వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉంటాయని చెప్పారు. వైద్యారోగ్య శాఖ అందిస్తున్న సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పీఆర్ను పెంచాలని సూచించారు. ఇంకా మెరుగైన సేవలు అందించేందుకు ప్లాన్ చేసుకోవాలని చెప్పారు. అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు తె లిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పూర్తి ప్రసంగం ఆయన మాటల్లోనే.. వైద్యానికి, మానవ జీవితానికి ఎడతెగని సంబంధం..
‘అప్పిచ్చువాడు, వైద్యుడు, ఎప్పుడు ఎడతెగక పారు ఏరున్, ద్విజుడున్ చొప్పడిన యూరనుండుము చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ’
నివాసయోగ్యమైన ప్రాంతం ఏదని గురువుగారిని శిష్యుడు అడిగినప్పుడు శతకకారులు చెప్పిన పద్యం ఇది. అప్పు ఇచ్చేవాడు, వైద్యు డు, నిరంతరం పారే ఏరు వంటి లక్షణాలన్నీ ఉన్న ఊర్లోనే నివాసం ఉండాలని, లేకపోతే వద్దని సూచించారు. ఇందులో వైద్యుని గురిం చి ప్రముఖంగా చెప్పారు. వైద్యానికి, మానవ జీవితానికి ఎడతెగని సంబంధం ఉన్నది. ఈ ప్రపంచంలో మానవ జాతి ఉన్నంత కాలం వైద్య రంగం కూడా కొనసాగుతూనే ఉంటుం ది. రాష్ట్ర వైద్య రంగంలో అనేక అద్భుత కార్యక్రమాలు చేసుకొని, చాలా పురోగమించాం. ఒ క్క మాటలో వివరించాలంటే 2014లో వైద్యరంగానికి బడ్జెట్ కేటాయింపులు రూ.2,100 కోట్లు మాత్రమే. 2023-24లో కేటాయింపు లు 12,367 కోట్లు. దీన్ని బట్టే వైద్యరంగంలో తెలంగాణ పురోగమనం అర్థం అవుతుంది. వైద్యారోగ్యశాఖ అత్యధిక ప్రాధాన్యం కలిగిన శాఖ. చురుగ్గా ఉండాల్సిన శాఖ. అందుకే వై ద్యారోగ్యశాఖను అనూహ్యంగా విస్తరిస్తు న్నాం. 17 వేల పడకల నుంచి 50 వేల పడకలకు విస్తరిస్తున్నాం. 1,400 ఉన్న ఆక్సిజన్ బె డ్లను 50 వేలకు పెంచుకుంటున్నాం. ఆక్సిజన్ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రాధేయపడకుండా సొంతంగా 550 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నాం.
ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కొనేలా..
నాకొక విచిత్రమైన అనుభవం ఉన్నది. మ న ప్రాంతానికి సాధారణంగా మిడతల దండు రాదు. వెనుకటి కాలంలో మిడతల బెడద ఉం డేది. మహాకవి శ్రీనాథుడు జైలులో నిర్బంధంలో ఉన్నప్పుడు ఒక పద్యం పాడారు. పొ లం తీసుకొని కౌలుకు చేసుకుంటుంటే కృష్ణవేణమ్మ కొంత తీసుకుని పోయింది, బిలబిలాక్షులు (మిడతలు) కొంత తీసుకుపోయానని బాధపడ్డారు. కానీ ఈ మధ్య మనకు మిడతల సమస్య లేదు. మధ్య ఆసియా నుంచి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ మీదుగా గుజరాత్, రాజస్థాన్ వరకు తరుచూ మిడతల దండు వస్తూ ఉం టుంది. అయితే ఆ మధ్య ఈ మిడతల దండు రాజస్థాన్ దాటి హర్యానాలోకి వచ్చి, అకడి నుంచి మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోకి ప్రవేశించాయి.
ఆదిలాబాద్ సరిహద్దు దాకా విస్తరిస్తూ వస్తున్నాయని కేంద్రం హెచ్చరించింది. అప్పు డే ఉత్తర భాగాన ఉన్న కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేసి, ప్రజలను, పంటలను కాపాడుకునేందుకు ఫైరింజన్లు, స్ప్రేలతో యుద్ధం మాదిరిగా సిద్ధమయ్యాం. ఆ సమయంలో ఈ చర్యల పర్యవేక్షణ కోసం కేంద్రం నుంచి ఒక మహిళా అధికారి (ఎంటమాలజిస్ట్), మన దగ్గర అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉండే రెహమాన్ అనే ఎంటమాలజిస్టు వచ్చారు. వారిద్దరికీ హెలికాప్టర్ ఇచ్చి సరిహద్దులకు పంపించా. అయితే మహారాష్ట్రలోనే మిడతల దండును చంపేయడం వల్ల, అవి మన దాకా రాలేదు. ఆ తర్వాత ఇద్దరు ఎంటమాలజిస్టులు నన్ను కలిశారు.
‘సర్ మమ్మల్ని బాగా చూసుకున్నా రు, మాకు హెలికాప్టర్ ఇచ్చి పంపారు, మాకు ఎక్కడా ఇలాంటి గౌరవం దొరకలేదు’ అని ధన్యవాదాలు తెలిపారు. ఆ సమయంలో నే ను వారితో కాసేపు మాట్లాడాను. సైన్స్ ఇం తగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా ఈ సమస్యకు పరిషారం ఎందుకు కనుకోలేదు అని అడిగా. సర్ మనం మిడతలన్నింటినీ చం పలేం, పూర్తిగా నిర్మూలించలేం, అది అసాధ్యమని చెప్పారు. ఈ భూమి మీదికి మనిషి 4 లక్షల ఏండ్ల క్రితం వచ్చాడు. కానీ ఈ మిడతలు, బ్యాక్టీరియాల వంటివి మనకంటే 4 లక్షల ఏండ్ల ముందే.. అంటే 8 లక్షల ఏండ్ల క్రితమే ఉద్భవించాయి. అవి సాధారణంగా నిద్రాణదశలో ఉంటాయి. వాటికి వ్యతిరేక చ ర్యలు జరిగితే ప్రకోపం చెంది ఇబ్బందులు కలిగిస్తాయని చెప్పారు.
కరోనా కూడా అటువంటిదేనా? రాబోయే రోజుల్లో ఇలాగే ఉంటుం దా? అని అడిగితే.. అవును సర్.. రాబోయే రోజుల్లో కరోనాను మించిన వైరస్లు వస్తా యి, అప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతాయని అన్నారు. అలాంటి పరిస్థితే వస్తే ప్రజలను ఎలా రక్షించుకోవాలో ఎంటమాలజిస్టులుగా సలహాలివ్వాలని అడిగాను. వాళ్లు ఒక్క టే మాట చెప్పారు. ఎకడైతే వైద్యారోగ్య వ్య వస్థ పకడ్బందీగా, పటిష్ఠంగా ఉంటుందో, అ కడ తకువ నష్టాలు జరుగుతాయి. లేకపోతే నష్టాలు ఎకువగా జరుగుతాయని చెప్పారు. దీన్ని బట్టి ఆరోగ్యశాఖ ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. వెంటనే నేను ఆలోచించి.. ఎలాంటి పరిస్థితినైనా ఎదురొనేలా ఆరోగ్యశాఖను తీర్చిదిద్దాలని నిర్ణయించా. ఆరోగ్యశా ఖ మంత్రిని, అధికారులను పిలిచి వారాల త రబడి చర్చించాం. అవసరమైన ఆర్థిక ప్రేరణ ఇవ్వడానికి బడ్జెట్ కూడా భారీగా పెంచాం.
ప్లానింగ్కు సమయం కేటాయించండి
ఆరోగ్యశాఖలోని ఉన్నతాధికారులు ప్లానిం గ్కు ఎక్కువ సమయం కేటాయించాలని కోరుతున్నా. ఈ రోజు మనం ఏ స్టేజ్లో ఉన్నాం? ఇంకా ఎంత ముందుకు పోవాలి? కొత్త ఆవిషరణలు? చేపట్టాల్సిన చర్యలు ఏమిటి? అ నే ప్రణాళికల కోసం టైం కేటాయించాలి. దీని కి ఒక ఉదాహరణ చెప్తాను. గతంలో పేద గర్భిణులు కూడా ప్రసవానికి ప్రైవేట్ దవాఖానకే వెళ్లేవాళ్లు. ప్రభుత్వం తెచ్చిన కేసీఆర్ కిట్ అనే చిన్న ఇన్పుట్తో వారికి రూ.12-13 వేలతో అనేక ప్రయోజనాలు కలిగాయి. దవాఖానల్లో ప్రసవాలు పెరిగాయి. ప్రభుత్వ దవాఖానల్లో గతంలో 30% ప్రసవాలు జరిగితే, ఇప్పుడు 70% వరకు జరుగుతున్నాయి. దీంతో మహిళ ల ఆరోగ్యం బాగుంటున్నది, అబార్షన్లు, దుర్మార్గపూరిత చర్యలు జరగడం లేదు. మా తాశిశు మరణాలు తగ్గాయి. ‘బెస్ట్ ప్లానింగ్ ఈ జ్ హాఫ్ సక్సెస్’ (ఉత్తమ ప్రణాళికలు రూపొందిస్తే సగం విజయం సాధించినట్టే) అని చెప్తుంటారు. వై ద్యారోగ్యరంగం ఇంకెంత గొప్పగా ఉండాలి, ఎంత ముందుకెళ్లాలి, ఈ లక్ష్యాలను ఎలా సాధించాలో మీరే ఆలోచించగలరు.
పీఆర్ పెంచాలి
వైద్యారోగ్యశాఖ అధికారులకు పబ్లిక్ రిలేషన్స్ (పీఆర్) చాలా తకువ. అందరూ మి మ్మల్ని విమర్శించే వాళ్లే తప్ప మెచ్చుకునే వా ళ్లు ఉండరు. జర్నలిస్టులు, నాయకులు, మం త్రులు, ఎమ్మెల్యేలు అందరూ మిమ్మల్నే విమర్శిస్తారు. నేను మీతో గంటల తరబడి మాట్లాడిన సందర్భాల్లో కలిగిన అనుభవాలు ఇవి. కానీ సరైన పీఆర్తో దీన్ని మార్చొచ్చు. గతం లో పోలీస్ అంటే కొడుతూనే ఉంటారనే భా వన ఉండేది. కానీ మనం మొత్తం ప్రొఫైల్ను మార్చినం. ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అని గర్వం గా చెప్పుకుంటున్నం. అదే జరుగుతున్నది కూ డా. గతంలో ఎస్సైలకు భయపడేవాళ్లం, ఇప్పు డు ఏసీపీ దగ్గరికి పోయినా, సీపీ దగ్గరికి పో యినా మర్యాదిచ్చి, కాఫీ ఇచ్చి మాట్లాడుతున్నరు. ఆ గౌరవం దొరుకుతున్నదని నాతో వ్యాపారవేత్తలు చెప్తున్నరు. ఇదే తరహాలో వైద్యశాఖ నిత్యం ప్రజల జీవితాలతో, ప్రజల ఆరోగ్యంతో పెనవేసుకొని ఉండే గొప్ప ప్రభు త్వ విభాగం. కాబట్టి పీఆర్ బాగా పెరగాలి. మీకోసం మేమున్నామని డాక్టర్లను పెట్టి పోస్ట ర్లు రావాలి. పీహెచ్సీ మీది, మీకోసమే అనే విషయాన్ని, వైద్యశాఖ ప్రజల కోసం ఏమేం చేస్తుందనే విషయాలన్నీ ప్రజలకు తెలియాలి. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మంచి చురుకైన వ్యక్తి. కాబట్టి వైద్యశాఖ అందించే సేవలు ప్రజల్లోకి పోయేలా పీఆర్ను పెంచాలని కోరుతున్నాను. వైద్యారోగ్యశాఖ ప్రజల బాగు కోసం ఏం చేస్తుందనేది ప్రజలకు బాగా తెలిసేలా చర్యలు చేపట్టాలి. ప్రయత్నిస్తే కచ్చితంగా ఫలితం ఉంటుంది.
శ్రేష్ఠత కోసం పడే తపన నిరంతరమైనది
రాష్ట్రంలో గొప్పగా హాస్పిటళ్లు కట్టుకుంటున్నాం. వరంగల్లో ప్రపంచంలో ఎకడాలేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను కడుతున్నాం. అక్కడ మెడికల్ సిటీ లాగా ఏర్పాటవుతున్నది. ఒకప్పుడు నిమ్స్లో 900 పడకలుంటే తెలంగాణ వచ్చిన తర్వాత 1,500 పడకలకు తీసుకుపోయినం. పాత నిమ్స్ కన్నా ఎక్కువ ఉండేట్టు ఇప్పుడు మరో 2,000 పడకల బ్లాక్ను మనం కట్టుకుంటున్నం. హైదరాబాద్లో టిమ్స్ కింద నాలుగువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడుతున్నం. వీటిని కట్టుకుంటూ పోతే సరిపోదు. అందించవలసిన ఉత్తమమైన సేవలు, విదేశాలకు పోకుండా ఇకడే అద్భుతమైన వైద్య సేవలు, టెలిమెడిసిన్ బాగా వినియోగించడం, వీటి సమాహారంగా అద్భుతాలను ఆవిషరించే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ముందుకు వెళ్లాలి. ఇప్పటికే ఇంత ఎదిగామని, గొప్పగా ఫీలై రిలాక్స్గా ఉంటే కాదు. ప్రజల కోసం ఇంకా ఏం చేయగలం? అని ఆలోచించాలి. శ్రేష్ఠత కోసం పడే తపన నిరంతరమైనది. అదేవిధంగా సంస్కరణలు నిరంతరం కొనసాగాలి. ఉత్తమోత్తమ సేవలు రాష్ట్ర ప్రజలకు అందించడానికి, కరోనా వంటి మహమ్మారి వ్యాపిస్తే మా వైద్య శాఖ ఉన్నది, మమ్మల్ని కాపాడుతుంది అనే ధీమా ఇవ్వడానికి, విపత్తులను ఎదురోవడానికి సిద్ధంగా ఉండాలి. వైద్య విధానం కొత్త పుంతలు తొకుతున్న నేటి కాలంలో మన రాష్ట్రంలోని పరిస్థితులను అధ్యయనం చేసి, అందుకు అనుగుణంగా వైద్యసేవలు అందించేలా వైద్యులు ప్రణాళికలు రూపొందించాలి.
మన గ్రామాలు, మండలాలు, జిల్లాల వాతావరణ పరిస్థితులు అధ్యయనం చేసి, అక్కడ వచ్చే జబ్బులను ఎదుర్కొనేలా ఉండా లి. వైద్యారోగ్య శాఖ మీదున్న అపవాదును తొలగించుకొని, రాష్ట్రంలో వైద్యశాఖే నంబర్ వన్ అని పేరొచ్చేలా కృషి చేయాలి. వైద్యారోగ్యశాఖ సాధించిన విజయాలను రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్న’.. అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అందరికీ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
డాక్టర్లు గొప్పోళ్లు, మంచి మనసున్నోళ్లు
ఏదైనా దవాఖానలో రోగిని కింద పడుకోబెట్టి చికిత్స చేస్తే కొందరు దాన్ని ఫొటో తీసి వ్యతిరేకంగా వార్తలు రాస్తుంటారు. కానీ వాస్తవం చాలా భిన్నంగా ఉంటుంది. గతంలో మనకు పెద్ద దవాఖానలంటే నిలోఫర్, ఉస్మానియా, గాంధీయే దిక్కు. ప్రభుత్వ దవాఖానలపై నమ్మకంతో ఎంతోమంది పేదలు అక్కడికి వస్తుంటారు. వాస్తవానికి అవి వెయ్యి పడకల దవాఖానలే. కానీ అంతకన్నా ఎక్కువ మంది వస్తుంటారు. అక్కడి డాక్టర్లు గొప్పవారు, మంచి మనసున్నవాళ్లు. నిరుపేదలు వైద్యం కోసం వస్తే, పడకలు లేవని రిజెక్ట్ చేస్తే ఎక్కడికి పోతారు? ప్రైవేట్కు వెళ్లే డబ్బులు ఉండవు. అందుకే.. బెడ్లు అందుబాటులో లేనప్పుడు ఉదారమైన హృదయంతో ఒక అరగంట ఎకువ పనిచేసైనా, కిందనే బెడ్ వేసి వైద్యం అందిస్తారు. కానీ కొందరు ఈ వాస్తవాలను పట్టించుకోకుండా ‘ఉస్మానియాలో బెడ్లు లేవు, పేషెంట్లను కింద పడుకోబెడుతున్నరు’ అంటూ వక్రీకరణలు చేస్తారు.
మనం కూడా మానవత్వ కోణంలో ఆలోచించాలి. ఒకసారి ఒక విచిత్రమైన సందర్భం వచ్చింది. కొందరు డాక్టర్లను అదిలాబాద్, ములుగు, భూపాలపల్లి అటవీ ప్రాంతాలకు పోస్టింగ్లు ఇస్తే వాళ్లు జాయిన్ కాలేదు. వాళ్లను పిలిపించాను. వైద్యో నారాయణో హరి. నువ్వు చేసే పని వేరేవాళ్లకు చేయరాదు. ఎంబీబీఎస్ అనేది ప్రత్యేకమైన చదువు. ఐఏఎస్లైనా, మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా జబ్బుపడితే డాక్టర్ల దగ్గరకు వచ్చి చెయ్యి చాచాల్సిందే. అలాంటిది మీరు ఎందుకు వెళ్లడం లేదని అడిగాను. మేం పోవడానికే సిద్ధమే కానీ మా భార్యలు రావడం లేదు సర్ అని వాళ్లు చెప్పారు. ఎందుకని అడిగితే.. అకడ ఒక ఒక సినిమా హాల్ లేదు, పిల్లలకు సరైన స్కూల్ లేదు, ఇతరత్రా సౌకర్యాలు లేవు. అందుకే అక్కడ ఉండటానికి వాళ్లు ఇష్టపడటం లేదని చెప్పారు. దీంతో వాళ్లు తాలూకా కేంద్రంలో లేదా జిల్లా కేంద్రంలో ఉండేలా, వారికి ప్రత్యేక అలవెన్స్ ఇచ్చేలా నిబంధనలు సడలించాలని హెల్త్ సెక్రటరీకి చెప్పా.
న్యూట్రిషన్ కిట్ల పరమార్థం
ఒక జాతిలో పుట్టే బిడ్డలు ఒడ్డూ, పొడుగు బాగుండాలంటే వాళ్లు గర్భంలో ఎదిగే కాలంలో ఎలాంటి ఆటంకం ఉండకూడదు. ఒకసారి ఎదుగుదల లోపాలు ఏర్పడితే, ఆ జాతిలో మళ్లీ పూర్వపు ఎదుగుదల చూడాలంటే వందేండ్లు పడుతుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు. పెరుగుదలలో సమస్య రాకుండా ఉండాలంటే ముందస్తుగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే గర్భిణుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేస్తున్నాం. వీటి పరమార్థం ఇదే.
గాంధీ సిబ్బందికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా
కరోనా కాలంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ గొప్పగా పనిచేసింది. రూ.లక్షలకు లక్షలు ఫీజు తీసుకునే ప్రైవేట్ దవాఖానలు కూడా కొవిడ్ సోకిన రోగి పరిస్థితి విషమిస్తే గాంధీ దవాఖానకు పంపించేవి. గాంధీలోని డాక్టర్లు చాలెంజ్గా తీసుకొని కొన ప్రాణంతో వచ్చిన వారిని కూడా బతికించారు. ఈ సందర్భంగా గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావును నిజంగా అభినందిస్తున్నా. ఒక్కొక్కసారి తలుచుకుంటే చాలు ఒళ్లు జలదరించేలా అక్కడి సిబ్బంది గొప్ప సేవలు అందించారు. వారు అందించిన సేవలకు శిరస్సు వంచి నమసరిస్తున్నాను.
ప్రతి గర్భిణికి న్యూట్రిషన్ కిట్
రాష్ట్రవ్యాప్త పంపిణీ ప్రారంభించిన కేసీఆర్ .. స్వయంగా ఆరుగురికి అందజేత
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల రాష్ట్రవ్యాప్త పంపిణీని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నిమ్స్ వేదికగా ప్రారంభించారు. గర్భిణులు పోషకాహార లోపం, రక్తహీనత బారినపడకుండా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పథకానికి రూపకల్పన చేసింది. మొదటి దశలో రక్తహీనత అధికంగా నమోదైన ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో గతేడాది డిసెంబర్ 21న పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని ప్రారంభించి సుమారు 1.25 లక్షల మంది గర్భిణులకు కిట్లను పంపిణీ చేశారు. అక్కడ మంచి ఫలితాలు రావడంతో మిగతా 24 జిల్లాల్లోనూ పంపిణీ చేయాలని నిర్ణయించారు.
ఈ మేరకు బుధవారం పంపిణీని ప్రారంభించిన సీఎం ఆరుగురు గర్భిణులకు స్వయంగా అందించారు. ఈ కిట్లో కిలో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, కిలో ఖర్జూర, మూడు ఐరన్ సిరప్ బాటిళ్లు, అరకిలో నెయ్యి, 200 గ్రాముల పల్లిపట్టి, ఒక కప్పు, ప్లాస్టిక్ బాటిల్ ఉంటాయి. ప్రతి గర్భిణికి రెండు కిట్లు అందజేస్తారు. 13-27 వారాల మధ్య జరిగే రెండో ఏఎన్సీ చెకప్ సమయంలో తొలి కిట్, 28-34 వారాల మధ్య మూడో ఏఎన్సీ చెకప్ సమయంలో రెండో కిట్ను ఇస్తారు. ఒక్కో కిట్ విలువ రూ.2వేల వరకు ఉంటుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6.8 లక్షల మంది గర్భిణులకు ప్రయోజనం కలుగనున్నది.
దశాబ్ది భవనానికి అంకురార్పణ
హైదరాబాద్ నిమ్స్ దవాఖానలో అదనంగా నిర్మించనున్న ‘దశాబ్ది బ్లాక్’కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బుధవారం శంకుస్థాపన చేశారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం వైద్యారోగ్య దినోత్సవం సందర్భంగా నిమ్స్ విస్తరణ పనులకు అంకురార్పణ చేశారు. ఉదయం 11:42 గంటలకు సీఎం కేసీఆర్ నిమ్స్కు చేరుకున్నారు. ఉదయం 11:44 గంటల నుంచి 11:50 గంటల వరకు భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. నూతన బ్లాక్తో నిమ్స్లో మరో 2,000 ఆక్సిజన్ పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 500 ఐసీయూ బెడ్లు. ప్రస్తుతం ఉన్న పడకలు, ఎంసీహెచ్, నూతన పడకలు కలిపి నిమ్స్లో మొత్తం బెడ్స్ సంఖ్య సుమారు నాలుగు వేలకు చేరనున్నది. దీంతో దేశంలోనే అత్యధిక సూపర్ స్పెషాలిటీ పడకలు ఉన్న దవాఖానల్లో ఒకటిగా నిమ్స్ నిలువనున్నది. దశాబ్ది బ్లాక్ కోసం ప్రభుత్వం మొత్తం 33 ఎకరాల భూమిని కేటాయించింది.
35 విభాగాల సేవలు
నిమ్స్ విస్తరణలో భాగంగా మొత్తం మూడు బ్లాకులు నిర్మించనున్నారు. ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ సేవలకు ప్రత్యేకంగా భవనాలు అందుబాటులోకి రానున్నాయి. ఓపీ, ఎమర్జెన్సీ బ్లాక్లు ఎనిమిది అంతస్థుల్లో నిర్మాణం అవుతుండగా, ఇన్పేషంట్ల కోసం 13 అంతస్థులతో బ్లాక్ ఏర్పాటు చేయనున్నారు. కొత్త భవనంలో మొత్తం 30 ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి. ప్రస్తుతం నిమ్స్లో 30 విభాగాలు సేవలు అందిస్తుండగా.. విస్తరణతో వీటి సంఖ్య 35కు పెరుగుతుంది. ప్రాజెక్టు వ్యయం రూ.1,571 కోట్లు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, తాత మధు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, కార్పొరేషన్ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, గెల్లు శ్రీనివాస్యాదవ్, వాసుదేవరెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, సీఎస్ శాంతికుమారి, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీపీహెచ్ గడల శ్రీనివాస్, డీఎంఈ రమేశ్రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్శర్మ, సీఎం ప్రధాన సలహాదారు సోమేశ్కుమార్, సీఎం కార్యదర్శి రాజశేఖర్రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్, నిమ్స్ డైరక్టర్ బీరప్ప, సూపరింటెండెంట్ సత్యనారాయణ, అనుసంధాన అధికారి మార్త రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
నిమ్స్ నూతన బ్లాక్ విశేషాలు
నిర్మాణ వ్యయం : 1,571 కోట్లు
పడకల సంఖ్య : 2,000
ఐసీయూ బెడ్స్ : 500
ఆపరేషన్ థియేటర్లు : 30
స్థలం విస్తీర్ణం : 33 ఎకరాలు