యాదాద్రి, జనవరి 24: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పాలనలో సబ్బండ వర్ణాలకు సముచిత గౌరవం దక్కిందని ఎక్సైజ్శాఖ వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని శారాజీపేటలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని విప్ గొంగిడి సునీత, ఎన్డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. యాదవులు, రజకులు, కుమ్మరులు, ముదిరాజ్, గౌడలు ఇలా అన్నివర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో జీవించేలా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను సీఎం ప్రవేశపెట్టారని తెలిపారు. స్వరాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణంతో గ్రామీణ ప్రాంతాలు సస్యశ్యామలమయ్యాయని.. ఏ గ్రామం చూసినా పచ్చని పంటలతో స్వాగ తం పలుకుతున్నదని చెప్పారు. హిందూ సమాజం గర్వపడేలా పూర్తి కృష్ణశిలతో యాదాద్రి స్వామివారి ఆలయ పునర్నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు.