CM KCR | హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): ఉన్నత చదువులు చదివి జీవితంలో మరింతగా ఎదిగి సమాజానికి గొప్పగా సేవ చేయాలని తమ మనుమడు హిమాన్షురావును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దంపతులు ఆశీర్వదించారు. సీఎం కేసీఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షురావు మంగళవారం గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ సూల్ నుంచి తన 12వ క్లాస్ పూర్తిచేసి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి హిమాన్షు తాత, నాయనమ్మలైన సీఎం కేసీఆర్, శోభ దంపతులు, తల్లిదండ్రులు మంత్రి కేటీఆర్, శైలిమ, సోదరి అలేఖ్య తదితర కుటుంబసభ్యులు హాజరయ్యారు.
హిమాన్షుకు ఎక్స్లెన్సీ అవార్డు
‘గ్రాడ్యుయేషన్ డే’ సందర్భంగా 12వ తరగతిని విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు ఓక్రిడ్జ్ సూల్ గ్రాడ్యుయేషన్ పట్టాలను అందజేసింది. ఈ సందర్భంగా విద్యనభ్యసిస్తూనే క్రీడలు, సాంసృతిక, సామాజిక సేవా తదితర రంగాల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సూల్ యాజమాన్యం ప్రతిభా పురసారాలను అందజేసింది. హిమాన్షురావు ‘కమ్యూనిటీ యాక్టివిటీ సర్వీసెస్’ ( సీఏఎస్) విభాగంలో విశేష ప్రతిభ ప్రదర్శించినందుకు సీఏఎస్ విభాగంలో ఓక్రిడ్జ్ స్కూల్ ఎక్స్లెన్స్ అవార్డును ప్రదానం చేసింది.
గ్యాడ్యుయేషన్ పట్టాను అందుకున్న హిమాన్షు వెంటనే వేదిక దిగివచ్చి తన తాత, సీఎం కేసీఆర్ చేతుల్లో పెట్టి పాదాలకు నమసరించి ఆశీర్వాదం తీసుకున్నారు. చిన్నతనం నుంచీ తనచేతుల్లో పెరిగి నేడు పట్టభద్రుడుగా ఎదిగిన మనుమడిని చూసిన సీఎం కేసీఆర్ హృదయ పూర్వకంగా అభినందించారు. తాను చదువుకున్న పాఠశాల శిక్షణలో భాగంగా అప్పగించిన సామాజిక సేవా అంశాన్ని సవాలుగా స్వీకరించి, ఆ విభాగానికి అధ్యక్షత వహిస్తూ గొప్ప ప్రతిభ కనబరిచి అందులో ఎక్స్లెన్సీ అవార్డు పొందినందుకు సీఎం కేసీఆర్ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వదించారు. హిమాన్షు తల్లిదండ్రులు మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు తమ కుమారుడి ప్రతిభానైపుణ్యాలను చూసి పుత్రోత్సాహంతో పొంగిపోయారు. కార్యక్రమంలో హిమాన్షు అమ్మమ్మ శశిరేఖ, మేనమామలు రాజేందర్ ప్రసాద్ పాకాల, శైలేందర్ ప్రసాద్ పాకాల, హిమాన్షురావుతోపాటు గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన క్లాస్మేట్ ఆద్వైత్ బిగాల తండ్రి, బీఆర్ఎస్ ఎన్నారై సెల్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల, ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా తదితరులు పాల్గొన్నారు.