పొదుపు సంఘాల మహిళలు తీసుకున్న రుణాలపై ప్రభుత్వం వడ్డీ మాఫీ చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్లో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి ఫ్లెక్సీలకు మహిళలు, బీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు.
– భువనగిరి కలెక్టరేట్
ప్రభుత్వం ఆధునిక ధోబీఘాట్లు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ యాదాద్రి జిల్లా చౌటుప్పల్లోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద రజక సంఘం నాయకులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 141 ఆధునిక ధోబీఘాట్ల నిర్మాణానికి సీఎం కేసీఆర్ రూ.282 కోట్లు మంజూరు చేసినందుకు రజక సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన సలహాదారు కొండూరు సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.
– చౌటుప్పల్