హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులను అధినేత కే చంద్రశేఖర్ రావు ప్రకటించారు. 33 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. వారిలో ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ముగ్గురు జెడ్పీ చైర్మన్లను జిల్లా పార్టీ అధ్యక్షులుగా ప్రకటించారు.
ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్న నియమితులవగా, కుమ్రం భీం జిల్లాకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మంచిర్యాల జిల్లాకు బాల్క సుమన్, నిర్మల్ జిల్లాకు జీ. విఠల్ రెడ్డి.. పార్టీ అధ్యక్షులుగా నియమితులయ్యారు.
నిజామాబాద్ – ఏ. జీవన్ రెడ్డి
కామారెడ్డి – ఎంకే ముజీబుద్దీన్ (డీసీఎంఎస్ మాజీ చైర్మన్)
కరీంనగర్ – జీవీ రామకృష్ణారావు (సుడా చైర్మన్)
రాజన్న సిరిసిల్ల – తోట ఆగయ్య (మాజీ ఎంపీపీ)
జగిత్యాల – కే విద్యాసాగర్ రావు
పెద్దపల్లి – కోరుకంటి చందర్
మెదక్ – ఎం పద్మా దేవెందర్ రెడ్డి
సంగారెడ్డి – చింతా ప్రభాకర్ (మాజీ ఎమ్మెల్యే)
సిద్దిపేట – కొత్త ప్రభాకర్ రెడ్డి (ఎంపీ)
వరంగల్ – ఆరూరి రమేశ్
హనుమకొండ – దాస్యం వినయ్ భాస్కర్
జనగామ – పీ. సంపత్ రెడ్డి (జెడ్పీ చైర్మన్)
మహబూబాబాద్ – మాలోతు కవితా నాయక్ (ఎంపీ)
ములుగు – కే. జగదీశ్ (జెడ్పీ చైర్మన్)
జయశంకర్ భూపాలపల్లి – గండ్ర జ్యోతి (జెడ్పీ చైర్పర్సన్)
ఖమ్మం – తాతా మధుసూదన్ (ఎమ్మెల్సీ)
భద్రాద్రి కొత్తగూడెం – రేగా కాంతారావు
నల్లగొండ – రమావత్ రవీంద్ర కుమార్
సూర్యాపేట – బడుగుల లింగయ్య యాదవ్ (ఎంపీ)
యాదాద్రి భువనగిరి – కంచర్ల రామకృష్ణా రెడ్డి (ఆయిల్ ఫెడ్ చైర్మన్)
రంగారెడ్డి – మంచిరెడ్డి కిషన్ రెడ్డి
వికారాబాద్ – మెతుకు ఆనంద్
మేడ్చల్ – శంభీపూర్ రాజు (ఎమ్మెల్సీ)
హైదరాబాద్ – మాగంటి గోపినాథ్
మహబూబ్నగర్ – సీ. లక్ష్మారెడ్డి
నాగర్ కర్నూల్ – గువ్వల బాలరాజు
జోగులాంబ గద్వాల – బీ. కృష్ణమోహన్ రెడ్డి
నారాయణపేట – ఎస్. రాజేందర్ రెడ్డి
వనపర్తి – ఏర్పుల గట్టుయాదవ్ (మున్సిపల్ చైర్మన్)