హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): భద్రాచలం ప్రాంతంలో వరద ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. ఈ మొత్తంతో వరద బాధితులకు శాశ్వత ప్రాతిపదికన నివాస కాలనీల నిర్మాణాలు, భద్రాద్రి సీతారాముల దేవస్థానం చుట్టూ కరకట్ట అభివృద్ధి, బూర్గంపాడు వైపు ఉన్న కరకట్ట మరమ్మతులతోపాటు, ముంపు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. వరద ముంపునకు గురైన ప్రాంతాలను ముఖ్యమంత్రి ఆదివారం ఏరియల్ వ్యూ, క్షేత్రస్థాయి పర్యటనలతో పరిశీలించారు.
ఈ సందర్భంగా భద్రాచలంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ, వరద ముంపు ప్రాంతాల ప్రజలెవరూ భయపడాల్సిన పని లేదని, వారి రక్షణకోసం అన్ని చర్యలు తీసుకొంటామని భరోసా ఇచ్చారు. తరచుగా వరదల్లో మునిగిపోతున్న భద్రాచలం వాసుల కన్నీళ్లను తుడిచేందుకు.. శాశ్వత ప్రాతిపదికన నివాస కాలనీలు నిర్మిస్తామని ప్రకటించారు. వరద చేరని ఎత్తైన ప్రదేశాల్లో అనువైన స్థలాలను గుర్తించి, బాధితులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి, నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
తమకు శాశ్వత ప్రాతిపదికన రిలీఫ్ దొరకుతుండటంతో భద్రాచలం పునరావాస కేంద్రాల్లోని బాధితులు హర్షం వ్యక్తంచేశారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన కోసం శనివారం వరంగల్ జిల్లాకు చేరుకొని సమీక్షించిన సీఎం కేసీఆర్ హనుమకొండలో బస చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు భద్రాచలానికి రోడ్డు మార్గాన బయలుదేరారు. ఉదయం 11 గంటలకు భద్రాచలం చేరుకొన్న సీఎం.. అకడ పర్యటించి, ముంపు ప్రాంతాల బాధితులను పరామర్శించారు. సమీక్షా సమావేశం జరిపారు. అకడి నుంచి ఏటూరునాగారం వరకు సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అకడ కూడా వరద బాధితులను పరామర్శించి.. అధికారులతో సమీక్షించారు. ఏటూరు నాగారం నుంచి బయలుదేరిన సీఎం కేసీఆర్ ఆదివారం రాత్రి హనుమకొండలో మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి చేరుకొని అక్కడే బసచేశారు.
గంగమ్మ తల్లికి శాంతి పూజలు
ఆదివారం ఉదయం భద్రాచలం సమీపంలోని సారపాక వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్కు మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు. అక్కడ ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి ప్రవాహాన్ని, పరిసర ప్రాంతాలను బ్రిడ్జి మీద నుంచి సీఎం కేసీఆర్ పరిశీలించారు. భద్రాద్రి రామయ్య దేవస్థానం అర్చకుల వేద మంత్రోచ్చారణల నడుమ గంగమ్మ తల్లికి సీఎం కేసీఆర్ శాంతి పూజలు జరిపారు. పసుపు కుంకుమలు చల్లి చీరెసారె సమర్పించారు.
అకడి నుంచి కరకట్ట వద్దకు చేరుకొని పరిశీలించారు. కరకట్ట పటిష్ఠత కోసం చేపట్టవలసిన చర్యలపై అధికారులకు సూచనలిచ్చారు. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల ప్రజలు ఎకువగా వరద తాకిడికి గురయ్యారని, అధికార యంత్రాంగం అప్రమత్తత వల్ల ప్రాణ నష్టం జరగలేదన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేశారని, మంత్రి పువ్వాడ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం కలెక్టర్లకు, ప్రజా ప్రతినిధులకు అభినందనలు తెలిపారు.
భద్రాచలంలో ముంపు శాశ్వతంగా సమస్యను పరిషరించాలని నిర్ణయించామన్నారు. భద్రాచలం పట్టణ కాంటూరు లెవల్స్ను పరిగణనలోకి తీసుకొని వరద బాధితులకు ఎత్తైన ప్రదేశాల్లో కాలనీల నిర్మాణం చేపట్టాలని సూచించారు. కరకట్ట ప్రాంతాల్లోని ముంపు నివాసాలను కూడా తరలించాలని చెప్పారు. కరకట్ట మరమ్మతులకు ఏపీ ప్రభుత్వంతో మాట్లాడుతామని పేర్కొన్నారు. ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా నిరంతరం బ్లీచింగ్ చేయాలని ఆదేశించారు.
అలక్ష్యం వద్దు.. అప్రమత్తంగా ఉండాలి
ఈ నెలాఖరుదాకా వానలు కొనసాగే అవకాశమున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజలు అలక్ష్యంగా ఉండవద్దని.. అనుక్షణం జాగ్రత్తగా ఉండాలని కోరారు. మరో 15 రోజులు అలర్ట్గా ఉండాలని, ఏమాత్రం రిలాక్స్ కాకూడదన్నారు. మారిన వాతావరణ పరిస్థితుల్లో క్లౌడ్ బరస్ట్లు జరుగుతున్నాయని.. పర్యవసానంగా వరద ముప్పు అనూహ్యంగా పెరుగుతున్నదని తెలిపారు. నిరంతర వర్షాల వల్ల తలెత్తే ఉత్పాతానికి నిదర్శనమే ప్రస్తుత వరదలని చెప్పారు.
ఇంతటి వరద బీభత్సాన్ని సైతం తట్టుకొని కడెం ప్రాజెక్టు నిలబడిందని సీఎం కేసీఆర్ అన్నారు. కడెం ప్రాజెక్టుకు చరిత్రలో ఎన్నడూ 2.9 లక్షల క్యూసెక్కులు దాటి వరద రాలేదని.. మొట్టమొదటిసారిగా ఇప్పుడు 5 లక్షల క్యూసెక్కులు దాటిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగుతున్నాయని, చెరువులు, కుంటలు నిండిపోయాయని సీఎం వెల్లడించారు. దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో నీటిపారుదల అంశాలు తన దృష్టికి వచ్చాయని, మొండికుంట వాగు, పాలెం వాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులను పూర్తి చేస్తామని చెప్పారు.
భద్రాచలం, బూర్గంపాడు, పినపాక నియోజకవర్గాల్లో వరద సమస్యలు వచ్చాయని.. ఇక్కడ పంటలు నీటమునిగి నష్టపోయిన రైతులకు సమీక్ష అనంతరం తగిన సహాయం అందిస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 25 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని.. పరిస్థితులు చక్కదిద్దుకొన్న తర్వాతే వారిని తిరిగి పంపించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలు ఒక్కింటికి 20 కిలోల చొప్పున 2 నెలలపాటు ఉచితంగా బియ్యం ఇస్తామని, రూ.10 వేల తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ నుంచి తామిచ్చిన ఆదేశాలను అనుసరిస్తూ, ప్రజలను వరదల నుంచి రక్షించి, ప్రాణహాని జరగకుండా కాపాడిన అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ అభినందించారు.
ఏటూరునాగారంలో సమీక్ష
ఏటూరునాగారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. నెలాఖరు వరకూ భారీ వర్షాలుంటాయన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇంత పెద్ద భారీ వర్షాలు వచ్చినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగానికి ప్రజా ప్రతినిధులకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. అన్ని శాఖల అధికారులు మూడు షిఫ్టులుగా పనిచేసి, లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎత్తైన ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
గత ప్రభుత్వాలు తాతాలిక నిర్మాణాలు మాత్రమే చేపట్టాయని, ఇపుడు ఎన్ని నిధులు ఖర్చయినా సరే శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని పేర్కొన్నారు. వరద పరిస్థితులపై భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడేలా నీటిపారుదల శాఖ అధికారులు ప్రత్యేకంగా ఒక బుక్ను తయారు చేయాలని సూచించారు. వరదతో చాలాచోట్ల మిషన్ భగీరథ పైపులు దెబ్బతిన్నాయని, వాటికి తక్షణమే మరమ్మతులు చేయించాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. ములుగు జిల్లాకేంద్రంలో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులు కోరినందున దీన్ని వెంటనే మంజూరు చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
వరద ప్రభావిత జిల్లాలకు నిధులు
వరద ప్రభావిత జిల్లాలకు తక్షణ సహాయం కింద ప్రత్యేకంగా నిధులు ఇస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ములుగు జిల్లాకు రూ.2.50 కోట్లు, భద్రాచలం జిల్లాకు రూ.2.30 కోట్లు, భూపాలపల్లి జిల్లాకు రూ.2 కోట్లు, మహబూబాబాద్ కు రూ.1.50 కోట్లు మంజూరు చేస్తున్నామని సీఎం తెలిపారు. వరద ముప్పు తొలగిపోయే వరకు ములుగు జిల్లా కేంద్రంలో ఒక హెలికాప్టర్ను, భద్రాచలంలో మరొక హెలికాప్టర్ను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కలుగకుండా పాత బ్రిడ్జిలు, కాజ్వేలు, కల్వర్టులను వెంటనే మరమ్మతులు చేయాలని సూచించారు.
కరెంటు సౌకర్యాన్ని కూడా అధికారులు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని తెలిపారు. పకాపూర్ గ్రామ అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరుచేశారు. శ్యాంపల్లి ఆర్అండ్బీ రోడ్డు పనులను సత్వరమే చేపట్టాలని, వరద ప్రాంతాల్లో పనులు చేసేందుకు ఎలాంటి నిధుల కొరత లేదని స్పష్టంచేశారు. ఏజెన్సీ ఏరియాలో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. ‘మనందరం ప్రజల కోసమే పనిచేయాలి. ఏ ఒకరినీ ఏమీ అనవద్దు. అటవీశాఖ అధికారులు పనుల పేరు మీద ఏమాత్రం ఇబ్బంది పెట్టవద్దు’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఏటూరునాగారంలో డయాలసిస్ సెంటర్ను వెంటనే ఏర్పాటుచేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనల్లో సీఎం కేసీఆర్ వెంట మంత్రులు హరీశ్రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వర్రావు, హరిప్రియ నాయక్, సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వర్రావు, రాములునాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, శంకర్నాయక్, ఆరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, టీ రాజయ్య, సీతక, ఎమ్మెల్సీలు ఎస్ మధుసూధనాచారి, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి, తాతా మధుసూదన్రావు, పాడి కౌశిక్రెడ్డి, తకెళ్లపల్లి రవీందర్రావు, బండాప్రకాశ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్, పంచాయతీరాజ్ కమిషనర్ హన్మంతరావు, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్రావు, ఆర్అండ్బీ ఈఎన్సీ (స్టేట్ రోడ్స్) రవీందర్రావు, హెల్త్ డైరెక్టర్ జీ శ్రీనివాసరావు, భద్రాచలం జిల్లా కలెక్టర్ అనుదీప్, ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణఆదిత్య, భూపాలపల్లి కలెక్టర్ భవేష్ మిశ్రా, హన్మకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, వరంగల్ కలెక్టర్ డాక్టర్ బీ గోపీ, సింగరేణి సీఎండీ శ్రీధర్, ములుగు ఎస్పీ సంగ్రామ్సింగ్ పాటిల్, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి, జడ్పీ చైర్మన్లు లింగాల కమల్రాజు, కోరం కనకయ్య, గండ్ర జ్యోతి, రాష్ట్ర రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, భద్రాచలం నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జి తెల్లం వెంకట్రావు, దిండిగాల రాజేందర్, ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
రామయ్య గుడికి రక్షణ కవచం
పవిత్రమైన భద్రాచల సీతారాములవారి ఆలయం ముంపునకు గురికాకుండా శాశ్వత ప్రాతిపదికన అన్ని చర్యలు తీసుకొంటామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. సీతారాముల పుణ్యక్షేత్రం అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపడుతామని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా త్వరలోనే భద్రాచలంలో పర్యటించి అభివృద్ధి ప్రణాళికపై నిర్ణయం తీసుకొంటామని తెలిపారు. భద్రాద్రిలోని సీతమ్మ పర్ణశాలను కూడా వరద నుంచి కాపాడటానికి అన్ని చర్యలు తీసుకొంటామన్నారు.
వరద బాధితులకు భరోసా
అనంతరం భద్రాచలం జడ్పీ హైసూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ ఉన్న బాధితులను పరామర్శించారు. ప్రతి ఒక్కరినీ పలకరించారు. వారి ఆరోగ్య పరిస్థితులు, యోగ క్షేమాలు తెలుసుకొన్నారు. బాధితులకు అందుతున్న నిత్యావసరాలు, సౌకర్యాలు, వైద్యం, ఇతర సహాయం గురించి ఆరా తీశారు. తమకు అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందుతున్నాయని, స్థానిక మంత్రి పువ్వాడ అజయ్కుమార్, అధికారులు తమను కంటికి రెప్పలా కాపాడుతున్నారని సీఎంకు బాధితులు వివరించారు. భద్రాచలంలో వరదలు వచ్చినప్పుడల్లా ఇకడి ప్రజలు ముంపునకు గురికావడం బాధాకరమని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలెవరూ భయపడవద్దని, ముంపు సమస్యను శాశ్వతంగా పరిషరిస్తామని భరోసానిచ్చారు.
వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే
భద్రాచలం పర్యటన అనంతరం సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో ఏటూరునాగారం దిశగా ఏరియల్ సర్వే నిర్వహించారు. గోదావరి నదికి ఇరువైపులా వరదల్లో చికుకున్న గ్రామాల్లో వరద పరిస్థితిని పరిశీలించారు. ఏటూరునాగారంలోని రామన్నగూడెం దగ్గర దిగిన సీఎంకు మహిళా, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్వాగతం పలికారు. అకడి నుంచి ఐటీడీఏ గెస్ట్ హౌజ్కు వెళ్లిన ముఖ్యమంత్రి మధ్యా హ్న భోజనం చేశారు. తర్వాత మంత్రులు, ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులతో కలిసి వరద తాకిడికి గురైన కరకట్టను పరిశీలించారు. వరద ప్రవాహం తగ్గాలని గోదావరికి తల్లికి సీఎం కేసీఆర్ చీరెసారె సమర్పించి, శాంతి పూజలు నిర్వహించారు. తరువాత ములుగు ఎమ్మెల్యే సీతక్క, నీటిపారుదల అధికారులను పిలిచి గోదావరి ప్రవాహ వివరాలు తెలుసుకొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను ఎదుర్కోవడానికి చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కరకట్టను రెండు లేదా మూడు ఫీట్ల ఎత్తు పెంచుతూ నిర్మించాలని సూచించారు.
వరద తగ్గే వరకూ పునరావాస కేంద్రాలు
రామన్నగూడెంలోని పునరావాస కేంద్రానికి వెళ్లిన సీఎం.. బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న సహకారం, పునరావాస ఏర్పాట్లు, భోజన వసతులపై ఆరాతీశారు. వరద తగ్గే వరకూ పునరావాస కేంద్రాలు కొనసాగుతాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ‘వరదలు వచ్చినప్పుడు రామన్న గూడెంలో నష్టం జరుగుతున్నది. ఎస్సీ, ఎస్టీ కాలనీలను పరిశీలించాను. ఈ ప్రాంతానికి వరద ముంపు రాకుండా, ఇబ్బంది లేకుండా శాశ్వత చర్యలు తీసుకొంటాం. మీరందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా.. వరదల్లో ఎవరూ ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి’ అని సీఎం చెప్పారు. వరద తగ్గుముఖం పట్టగానే అధికారులు వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించి, చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. వరద ప్రమాదం నుంచి ప్రజలను బయట పడేసిన ప్రజాప్రతినిధులను, అధికార యంత్రాంగాన్ని అభినందించారు.
సీఎంకు పల్లా కృతజ్ఞతలు
ములుగు జిల్లా కేంద్రానికి ఆర్డీసీ బస్డిపో, ఏటూరునాగారం మండల కేంద్రానికి అగ్నిమాపక కేంద్రాన్ని మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వరద బాధితుల పునరావాసం, రోడ్ల మరమ్మతులు, తక్షణ సహాయక చర్యలు చేపట్టడానికి నిధులు మంజూరు చేసినందుకు జిల్లా ప్రజల తరుపున సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ నెలాఖరుదాకా వానలు కొనసాగే అవకాశమున్నది. ప్రజలు అలక్ష్యంగా ఉండవద్దు. మరో 15 రోజులు అలర్ట్గా ఉండాలి. ఏమాత్రం రిలాక్స్ కాకూడదు. ఇప్పటి వరకు 25 వేల మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. పరిస్థితులు చక్కదిద్దుకొన్న తర్వాతే వారిని తిరిగి పంపించాలి. భద్రాచలంలో ముంపు సమస్యను శాశ్వతంగా పరిషరించాలని నిర్ణయించాం. అధికారులు వరద బాధితులకు ఎత్తైన ప్రదేశాల్లో కాలనీల నిర్మాణం చేపట్టాలి. కరకట్ట ప్రాంతాల్లోని ముంపు నివాసాలను కూడా తరలించాలి. భద్రాచల సీతారాములవారి ఆలయం ముంపునకు గురికాకుండా శాశ్వత ప్రాతిపదికన అన్ని చర్యలు తీసుకొంటాం. పుణ్యక్షేత్రం అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపడుతాం. ఇందుకోసం త్వరలో ప్రత్యేకంగా భద్రాచలంలో పర్యటిస్తా.
-ముఖ్యమంత్రి కేసీఆర్