హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ)/ఎల్బీనగర్ /హయత్నగర్: తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్గా పని చేస్తూ అకాల మరణం చెందిన వేద సాయిచంద్ దశదిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పాల్గొని, నివాళులు అర్పించారు. ఆదివారం హస్తినాపురంలోని జీఎస్ఆర్ కన్వెన్షన్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొని సాయిచంద్ చిత్రపటానికి పూలు చల్లి, శ్రద్ధాంజలి ఘటించారు. సాయిచంద్ తండ్రి వెంకట్రాములు, భార్య రజిని, కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. శోకతప్త హృదయులైన కుటుంబసభ్యులను ఓదార్చారు. సాయిచంద్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు మహమూద్అలీ, సీహెచ్ మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, జీ జగదీశ్రెడ్డి, ఎస్ నిరంజన్రెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీలు సంతోష్కుమార్, రాములు, వెంకటేశ్ నేత, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, గోరటి వెంకన్న, పాడి కౌశిక్రెడ్డి, ఎమ్మెల్యేలు బాల సుమన్, సుధీర్రెడ్డి, దానం నాగేందర్, ఆల వెంకటేశ్వర్రెడ్డి, గాదరి కిశోర్, హరిప్రియనాయక్, మంచిరెడ్డి కిషన్రెడ్డి, క్రాంతికిరణ్, నోముల భగత్, రసమయి బాలకిషన్, కార్పొరేషన్ల చైర్మన్లు వై సతీశ్రెడ్డి, దూదిమెట్ల బాల్రాజ్యాదవ్, వాసుదేవరెడ్డి, ఎర్రొళ్ల శ్రీనివాస్తోపాటు ప్రజా గాయకుడు గద్దర్తోపాటు పలువురు ప్రముఖులు, అభిమానులు పాల్గొని సాయిచంద్కు నివాళులు అర్పించారు.
సాయిచంద్ను స్మరిస్తూ గీతాలాపన
పాటలతో, ఆటలతో అందరినీ అలరించిన గాయకుడు సాయిచంద్ను స్మరిస్తూ గీతాలను ఆలపిస్తూ కళాకారులు నీరాజనం పలికారు. మధుప్రియ, మిట్టపల్లి సురేందర్, మానుకోట ప్రసాద్ బృందాలు సాయిచంద్ను స్మరిస్తూ గీతాలాపన చేశారు. ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న కూడా తన గానంతో సాయిచంద్కు నివాళులర్పించారు. ప్రభుత్వ విప్ బాల్కసుమన్ కార్యక్రమంలో ప్రత్యేక చొరవ తీసుకుని సమన్వయ పరిచారు. తెలంగాణ నలుమూలల నుంచి కళాకారులు, సాయిచంద్ అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
సాయిచంద్ కొడుకులాంటివాడు: మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
సాయిచంద్ తనకు కొడుకులాంటివాడు అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. సాయిచంద్ తమ జిల్లాకు చెందినవాడని, అరుణోదయ కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశారని గుర్తుచేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో చేరి ఉద్యమగీతాలను ఆలపించారని తెలిపారు. సాయిచంద్ లేనిలోటు పూడ్చలేనిదని నిరంజన్రెడ్డి పేర్కొన్నారు.