హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): జైన సమాజానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వరాల జల్లు కురిపించారు. జైన మతస్థుల కోరిక మేరకు జైన భవన్ నిర్మాణానికి ఉప్పల్ భగాయత్లో 2 ఎకరాల స్థలం, హైదరాబాద్ మాసబ్ట్యాంకు ప్రాంతంలో దశాబ్దాలుగా ప్రజలకు వైద్య సేవలందిస్తున్న మహావీర్ హాస్పిటల్ నిర్మితమై ఉన్న ప్రభుత్వ లీజు స్థలాన్ని ఉచితంగా కేటాయించారు. సోమవారం సచివాలయంలో సీఎం కేసీఆర్తో జైన మత పెద్దలు సమావేశమయ్యారు. తమ హకులను గుర్తిస్తూ, తమకు మైనార్టీ కమిషన్లో ప్రాతినిధ్యం కల్పించినందుకు సీఎం కేసీఆర్కు వారు ధన్యవాదాలు తెలియజేశారు. జైన భవన్తోపాటు మహావీర్ దవాఖానకు స్థలం కేటాయించాలని సీఎంకు విన్నవించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ మతస్థుల సంక్షేమానికి, వారి అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని పునరుద్ఘాటించారు.
గంగా జమున తెహజీబ్కు నిలయమైన తెలంగాణలో దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన విభిన్న మతాలు, సంస్కృతుల ప్రజలు సుఖశాంతులతో జీవించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. భారతదేశానికి నీరు, భూమి, వాతావరణం, సూర్యరశ్మి వంటి ప్రకృతి అందించిన వనరులను సద్వినియోగం చేసుకోవడంలో 75 ఏండ్లుగా దేశ పాలక వ్యవస్థ వైఫల్యం చెందిందని పేర్కొన్నారు. దేశంలో అందుబాటులో ఉన్న ప్రకృతి వనరుల వివరాలను ఒకొకటిగా సీఎం కేసీఆర్ వారికి వివరించారు. వ్యవసాయాధారిత దేశంలో కేంద్ర పాలకులకు దార్శనికత లేకపోవడమే రైతుల పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఇవాళ దేశానికే రోల్మాడల్గా నిలిచిందని, ప్రజలందరి సహకారంతో దేశవ్యాప్తంగా ఈ అభివృద్ధిని పరిచయం చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
కేసీఆర్ పాలన రామరాజ్యం: జైన సమాజం ప్రశంస
గత పాలకుల హయాంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత సమర్థవంతంగా శాంతిభద్రతలను పటిష్టంగా కొనసాగిస్తూ, తెలంగాణను అభివృద్ధి పథాన నడిపిస్తున్న సీఎం కేసీఆర్ పాలన రామరాజ్యాన్ని తలపిస్తున్నదని జైన సమాజం పెద్దలు కీర్తించారు. పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఈ విషయం తమ అనుభవంలోకి స్వయంగా వచ్చిందని స్పష్టంచేశారు. మరెవ్వరికీ సాధ్యం కాని అభివృద్ధి సీఎం కేసీఆర్ దార్శనికతతో సుసాధ్యమైందని కొనియాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, పారిశ్రామిక రంగానికి అవసరమైన నాణ్యమైన విద్యుత్తు, తదితర మౌలిక వసతులను పటిష్టపరచడంతో నేడు తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని జైన మతస్థుల ఐక్య సంఘం ‘శ్రీజైన్ సేవాసంఘ్’ కమిటీ సభ్యులు, జైన మత ప్రముఖులు ప్రశంసించారు.
మత్స్య, పశుసంవర్థక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన వారిలో.. శ్రీజైన్ సేవాసంఘ్ చైర్మన్ అశోక్ బర్మేచా, అధ్యక్షుడు యోగేశ్జైన్, వైస్ ప్రెసిడెంట్ వినోద్ సంచతి, కార్యదర్శి జీమురా, జైన్త్న్ర అవార్డు గ్రహీత, ఫౌండర్ సెక్రటరీ సురేందర్ లోనియా, మహావీర్ దవాఖాన పూర్వ చైర్మన్ మోతీలాల్ జైన్, మాజీ అధ్యక్షుడు గౌతం లోడ, మాజీ కార్యదర్శి బసంత్, మాజీ అధ్యక్షుడు గౌతంచంద్ జైన్, జువెల్లరీ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ షెర్మల్జైన్, జయప్రకాశ్ బాంగడ్, హిమాన్షు, తలసాని సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.