హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను ఈ నెల 6వ తేదీనే శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయి. షెడ్యూల్కంటే ముందే ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నది. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకర్గంలోని జడ్పీహెచ్ఎస్ రావిర్యాల నుంచి ప్రారంభించేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. వాస్తవానికి దసరా రోజే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సి ఉంది. కానీ విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రకటించడం, పండుగల కారణంగా కాస్త ముందుగానే ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులను ఆదేశించారు.