హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన 15,750 మం ది అభ్యర్థులకు సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్కు సానుకూలంగా తీర్పు వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో నిరుడు అక్టోబర్ 4న ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాలనే ఫైనల్ చేస్తూ.. నేడో, రేపో టీఎస్ఎల్పీఆర్బీ తుది ప్రకటన చేయనున్నది. జరిగిన తప్పొప్పులపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవరిస్తూ.. నిపుణుల కమిటీ వేయాలన్న హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ టీఎస్ఎల్పీఆర్బీ అధికారులు ఇటీవల సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే బోర్డుకు అనుకూలంగా తీర్చు వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో పోలీసు, జైళ్లు, ఫైర్, ట్రాన్స్పోర్టు, ఎక్సైజ్ శాఖల అధికారులకు టీఎస్ఎల్పీఆర్బీ నిరుడు అక్టోబర్ 4న ఇచ్చిన తుది ఫలితాలే ఫైనల్ అంటూ సమాచారం ఇచ్చినట్టు సమాచారం. ఆయా విభాగాల నియామక పత్రా లు తయారు చేసుకోవాలంటూ రాష్ఱ్రహోంశాఖ రహస్యంగా ఆదేశాలు ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఉన్నతాధికారులకు ఎంపికైన అభ్యర్థుల వివరాల లిస్టు, ఇతర లేఖలు వెళ్లాయి. డ్రైవర్, మెకానిక్ పోస్టులకూ లైన్క్లియర్ అయినట్టు సమాచారం.
సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర్నుంచి.. తుది ఫలితా లు విడుదల వరకు అన్నింటినీ పద్ధతి ప్ర కారం నిర్వహించామని, సాంకేతికంగా కూ డా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకొన్నామని బోర్డు తరఫు న్యాయవాది వివరించారు. దీంతో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన సుప్రీంకోర్టు కూడా.. బోర్డు వాదనలకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. తెలంగాణ హైకోర్టు వేసిన నిపుణుల కమిటీ గడువు కూ డా ముగియనున్నది. దీంతో ఈ కమిటీ కూడా బోర్డు వాదనకే కట్టుబడి ఉన్నదని విశ్వసనీయంగా తెలిసింది.
ఈ నెల 12 నుంచి ఉద్యోగాలకు ఎంపికైన వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వనున్నట్టు విశ్వసనీయ సమాచారం. 12 నుంచే నియామకపత్రాలు ఇచ్చేలా ప్రింటింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని సీఎంవో, హోంశాఖ నుంచి ఆదేశాలు వెళ్లాయి. 12కు ముందు లేదా తర్వాత స్వయంగా సీఎం రేవంత్రెడ్డి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించనున్నారు.
అప్పటి కేసీఆర్ ప్రభుత్వం 2022 ఏప్రిల్లో మొత్తం 17,516 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. వీటిల్లో 587 ఎస్సై, తత్సమాన ఉద్యోగాలకు, 16,604 కానిస్టేబుల్ తత్సమాన ఉద్యోగాలు ఉన్నాయి. 2022 ఏప్రిల్ నుంచి 587 ఎస్సై ఉద్యోగాలకు టీఎస్ఎల్పీఆర్బీ బోర్డు వివిధ దశల్లోపరీక్షలు నిర్వహించి, నిరుడు ఆగస్టులోనే తుది ఫలితాలను వెల్లడించింది. దీంతో ఎస్సై ఉద్యోగాలకు ఎంపికైన 587 మంది అభ్యర్థులు రాష్ట్ర పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. అభ్యర్థుల నియామక ప్రక్రియ 2022 ఏప్రిల్ నుంచి ప్రారంభమైంది. గర్భిణులైన అ భ్యర్థినులతో మొదలైన చిన్న చిన్న వివాదాలు… తుది పరీక్షలో వచ్చిన ట్రాన్స్లేషన్ ప్రశ్నల వరకు చాలా సందర్భాల్లో అభ్యర్థులు హై కోర్టు మెట్లు ఎక్కారు. అయినా, టీఎస్ఎల్పీఆ ర్బీ ఎప్పటికప్పుడు హైకోర్టు సూచనలు పాటి స్తూ.. రిక్రూట్మెంట్ ప్రక్రియను కొనసాగించింది.