హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి విద్యార్థులకు మార్చి 1 నుంచి 11 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ప్రీ పైనల్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు.
మార్చి 1న మొదటి భాష, 2న రెండోభాష, 4న మూడో భాష, 5న గణితం, 6న భౌతికశాస్త్రం, 7న జీవశాస్త్రం, 11న సాంఘికశాస్త్రం పేపర్లకు పరీక్షలను నిర్వహించాలని. ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలున్నందున పదోతరగతి ఎగ్జామ్స్ మధ్యాహ్నం వేళలో నిర్వహించాలని సూచించారు.