న్యూఢిల్లీ : ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఇవాళ కేంద్రమంత్రితో రాష్ట్ర మంత్రుల బృందం సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భేటీలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. కేంద్రం ధాన్యం సేకరణ చేయదని రాష్ట్ర మంత్రులకు గోయల్ స్పష్టం చేశారు. ఇప్పుడు ఉన్న విధానాన్ని ప్రజల కోసం మార్చాలని ప్రశాంత్రెడ్డి కోరగా.. ‘మీరు ఇక్కడ (ఢిల్లీలో)కు వస్తారుగా.. అప్పుడు మార్చండి’ అని గోయల్ అనగా.. భగవంతుడు దయ తలిస్తే తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రశాంత్రెడ్డి బదులిచ్చారు.
మీరు కూడా ఇద్దరితో మొదలై.. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు వచ్చారు కదా? అని ప్రశ్నించారు. మరో వైపు కేంద్రమంత్రి కిషన్రెడ్డిని సైతం భేటికి రావాలని గోయల్ కోరారు. సుమారు 15 నిమిషాల పాటు సమావేశాన్ని ఆపగా.. చివరకు కిషన్రెడ్డి రాకపోవడంతో సమావేశానికి కొనసాగించారు. షాపుల్లో ఏది అమ్ముడు పోతుందే అదే కోంటామని మంత్రులకు చెప్పారు. అయితే, ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్రెడ్డి, ఎంపీలు చేసిన వ్యాఖ్యల వీడియోలను గోయల్కు ప్రశాంత్రెడ్డి చూపించారు. పంజాబ్లో సేకరించిన విధంగా తెలంగాణలో ఎందుకు సేకరించరని కేంద్రమంత్రిని ప్రశాంత్ నిలదీశారు. తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ చేయమని, బియ్యం మాత్రమే తీసుకుంటామని కేంద్రమంత్రి చెప్పారు.