హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్లో కొత్త కమిటీలు ఏర్పాటైన కొద్దికాలంలోనే నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కొందరు మండిపడుతున్నారు. దీనికి అనుగుణంగానే శనివారం పీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం వాడివేడిగా జరిగింది. ఇంద్రవెళ్లిలో సభ నిర్వహించడంపై రేవంత్రెడ్డి, ఏలేటి మహేశ్వర్రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఉమ్మడి జిల్లాలో తనకు తెలియకుండా సభ ఎలా నిర్వహిస్తారని రేవంత్రెడ్డిని నిలదీయగా, ఇంద్రవెళ్లితో నీకేం సంబంధం.. నిర్మల్కే పరిమితం కావాలంటూ రేవంత్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో సీనియర్లు సర్దిచెప్పినట్లు సమాచారం. అంతకుముందే మహేశ్వర్రెడ్డి.. అసలిది రేవంత్ కాంగ్రెస్సా.. నేషనల్ కాంగ్రెస్సా అర్థంకావడం లేదని పలువురితో అన్నట్టు సమాచారం.