హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): మెయినాబాద్ ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో నిందితులు వాడిన నంబర్ వన్, నంబర్ టు అంటే ఎవరో తెలిసిపోయింది. నంబర్ వన్ అంటే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నంబర్ టు అంటే బీజేపీ అగ్రనేత, దేశ హోం మంత్రి అమిత్షా అని స్పష్టమైంది. ఇది ఎవరో చెప్పింది కాదు.. స్వయంగా ఆ కేసులో ప్రధాన నిందితుడే వెల్లడించారు. ఇదే విషయాన్ని రామచంద్ర భారతి హైదరాబాద్ పోలీసుల కస్టడీలో అధికారికంగానే చెప్పారని తెలిసింది. అంతే కాదు, నంబర్ వన్.. నంబర్ టు తనతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటారని, దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేల పార్టీ మార్చే కార్యక్రమానికి తామే వారికి నమ్మినబంటులమంటూ చెప్పుకొచ్చినట్టు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని తెలంగాణ పోలీసులు వీడియో రికార్డు కూడా చేసినట్టు సమాచారం. పార్టీ ఆదేశాల మేరకే తాము తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని చేపట్టామని, నంబర్ వన్ నరేంద్ర మోదీ, నంబర్ టు అమిత్షా తమతో రెగ్యులర్గా మాట్లాడుతారని చెప్పారని విశ్వసనీయ వర్గాలు తెలి పాయి. కర్ణాటక, ఢిల్లీ, రాజస్థాన్, బెం గాల్ తదితర రాష్ట్రాల్లో తామే స్వయం గా ఎమ్మెల్యేలతో మాట్లాడి ‘సెట్’ చేశామని కమల్ ఫైల్స్ నిందితులు వెల్లడించారని, ఏ విధంగా ఆయా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొన్నదీ వివరించారని, కస్టడీ సందర్భంగా నిందితులు చెప్పిన కొనుగోళ్ల వివరాలు విని పోలీసు అధికారులే విస్తుపోయారు.