హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ శనివారం హైదరాబాద్ నగరానికి రానున్నారు. సీజేఐ అయ్యాక తొలిసారి వస్తున్న ఆయన ఇక్కడి నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో ఉదయం 11 గంటలకు జరిగే స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు. ఇదే కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వీ రామసుబ్రమణ్యన్, జస్టిస్ పీఎస్ నరసింహ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నల్సార్ వీసీ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు.