హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : తిరుమల శ్రీవారిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకొన్నారు. సీజేఐ ఎన్వీ రమణ దంపతులు, బాలీవుడ్ నటి దీపిక పదుకొనె, సినీనటులు నయనతారవిఘ్నేశ్ దంపతులు స్వామి వారి ఆశీస్సులు పొందారు.
ఉదయం కుటుంబసమేతంగా సీజేఐ.. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ పండితులు జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు వేదాశీర్వాదంతో పాటు తీర్థప్రసాదాలు అందించారు. ముందుగా తిరుమల చేరుకొన్న సీజేఐకి టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. గురువారం శ్రీవారి హుండీకి రూ.3.52 కోట్ల ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు.