హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం రాత్రి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం ఎదుట టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్కుమార్ సంఘాల్.. సీజేఐకి స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతించారు.
ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం జస్టిస్ చంద్రచూడ్ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు శేషవస్త్రంతో సన్మానించి, వేద ఆశీర్వాదం చేశారు. అనంతరం శ్రీచంద్రచూడ్ దంపతులు ఆలయంలో గోపూజలో పాల్గొన్నారు. గోవు, దూడలకు పూజలు చేసి గ్రాసం తినిపించారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి వీర్రాజు, టీటీడీ సీవీఎస్వో నరసింహకిశోర్ పాల్గొన్నారు.