హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : నేరుగా విద్యాసంస్థల్లో చేరి చదువుకొనే అవకాశం లేని వారికి దూరవిద్య ఒక వరం. తక్కువ ఫీజులు.. ఉద్యోగం చేస్తూనే చదువుకొనే అవకాశం ఈ విధానం ప్రత్యేకత. ఇలాంటి విశేషాలున్న దూరవిద్యా కోర్సులకు ఇటీవలికాలంలో డిమాండ్ పెరిగింది. ప్రవేశాలు ఏటేటా పెరుగుతున్నాయి. గత ఐదేండ్లలో జాతీయంగా దూరవిద్యలో 13 శాతం నమోదు పెరిగింది. అంతేగాక, సివిల్స్, పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే వారు అత్యధికంగా దూరవిద్య ద్వారా ఆర్ట్స్ కోర్సుల్లో చేరుతున్నారని అఖిల భారత ఉన్నత విద్య (ఆలిండియా సర్వే ఆన్ హైయ్యర్ ఎడ్యుకేషన్) సర్వేలో తేలింది. ఉద్యోగస్థులు, కుటుంబ పోషణ కోసం చదువులకు దూరమైన వారు దూరవిద్యను ఓ అవకాశంగా వినియోగించుకొంటున్నారు. జాతీయంగా ఇగ్నో సహా 16 రాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీలు, ఒక ప్రైవేట్ యూనివర్సిటీలున్నాయి. ఇవే కాకుండా రెగ్యులర్ వర్సిటీల్లోనూ దూరవిద్యకేంద్రాలను నిర్వహిస్తున్నారు. వీటిల్లో యూజీ, పీజీ, సర్టిఫికెట్, డిప్లొమా, ఇంటిగ్రేటెడ్, పీహెచ్డీ వంటి కోర్సులను నిర్వహిస్తున్నారు.
మొగ్గు ఇలా..