హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): సివిల్ సప్లయ్ అధికారులు నిర్వహించిన దాడుల్లో బ్లాక్ మార్కెట్కు తరలిన 3,699 సిలిండర్లు సీజ్ చేసినట్టు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. వీటి విలువ సుమారు రూ.1.10 కోట్లని, మరో 70 చిన్న సిలిండర్లను కూడా సీజ్ చేసినట్టు తెలిపారు.
బ్లాక్మార్కెట్కు తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నట్టు పేర్కొన్నారు. 1,275 కేసుల్లో 216 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు ఆయన వెల్లడించారు.