హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగా ణ): రాష్ట్రంలో ధాన్యం సేకరణ వేగవంతం గా జరుగుతున్నదని, ప్రతిపక్షాలు రైతులతో రాజకీయం చేయొద్దని పౌరసరఫరాల కా ర్పొరేషన్ చైర్మన్ రవీందర్సింగ్ హితవు ప లికారు. శుక్రవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 15 నుంచి ధా న్యం సేకరణ జరపాలని రాష్ర్టానికి లేఖ రాయడానికి ముం దే.. సీఎం కేసీఆర్ వడ్ల కొనుగోళ్లు ప్రారంభించారని స్పష్టంచేశారు.
ఇప్పటివరకు 6 వేల కేంద్రాలను ప్రారంభించి ధాన్యాన్ని కొ నుగోలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ ఏడాది ఇదే రోజు వరకు 10.60 లక్షల మె ట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిపారు. వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల నష్టపరిహారం సీఎం కేసీఆర్ ప్రకటించారని చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యం బిల్లులను వా రంలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్టు పేర్కొన్నారు.
కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తితే రైతులు ఫోన్ చేస్తున్నారని.. గురువారం జనగామ జిల్లా కూనూరుకు వెళ్లి, రైతులతో మాట్లాడి సమస్యను పరిష్కరించినట్టు తెలిపారు. తేమ శాతం17 కంటే ఒక శాతం ఎక్కువ ఉన్నా కొపాని అధికారులకు సూచించానని చెప్పారు.